పిద్దిపేట పట్టణంలో ఆదివారం అర్థరాత్రి హై డ్రామా నడిచింది. పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులులాల్ కమాన్ పైన కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ, అది అక్కడ నుండి తొలగించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విగ్రహాన్ని తొలగించారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని చెబుతుంటారు.. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత.. తెల్లారేసరికి మరో పార్టీలో కనిపించి ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో చూశాం.. అయితే, తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ.. కానీ, సీఎం కేసీఆర్కు చివరకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నా ఫామ్హౌస్ను ట్రాక్టర్ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు…
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల దళితబంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, దళితుడిని సీఎంను ఎందుకు చేయలేదు..? దళితుడికి సీఎం అయ్యే అర్హత లేదా..? అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా ఎందుకు పాల్గొనలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. Read Also : టీఆర్ఎస్ విజయగర్జన సభ మళ్లీ…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తున్నా.. మొత్తంగా మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నారు.. ఇక, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోతోంది.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ నడుస్తున్నా.. కాంగ్రెస్ లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఈ ఫలితాలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఇలా స్పందించారు.…
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను…
తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి…
తెలంగాణలో ఉప ఎన్నిక వేడి బాగా రాజుకుంది. మరో రెండురోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆతర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. బలమైన స్థానంలో ఓటమి పాలయింది. దీంతో పతనం మొదలైపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే ఆవెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో…
హుజూరాబాద్లో అసలేం జరుగుతోంది? ఎవరికి వారు గెలుపు ధీమాతో వున్నారు. కానీ ఓటరు మనసులో ఏముంది? వారు ఎవరికి ఓటేస్తారు? అనేది అంతుచిక్కడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్లను టెన్షన్ పెట్టిస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ఓటర్ల మనసులో అసలు ఏముందో తెలియక పార్టీలు తెగ గింజుకుంటున్నాయి. పైకి మీకే ఓటు వేస్తామని ఎవరికి వారు ఓటర్లు చెబుతున్నా తెలియని భయం పార్టీలని బాగా…
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మాటల యుద్ధంగా మారుతోంది. అధికార టీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. టీర్ఎస్ తో కొట్లాడే దమ్ము లేక కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటయిందని, నమ్మకాల పార్టీ టీఆర్ఎస్ కు- అబద్దాల పార్టీ బీజేపీకి మధ్య పోటీ నెలకొందన్నారు. ఇది నడమంత్రపు ఎన్నిక. ఎవరు గెల్చినా రెండేళ్ల నాలుగు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. రాష్ట్ర…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ హాట్ రాజకీయం నడుస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్కి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులోనే పడుకునే కేటీఆర్ ఆరు రోజుల తర్వాత నా ట్వీట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కేసీఆర్…