ఈవీఎంలు మార్చి భారీ కుట్ర.. సీబీఐ విచారణ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను తీసుకు వెళుతారు? ఎలాంటి భద్రత లేకుండా ఆ బస్ లను అక్కడ ఎందుకు నిలిపి వేశారని అరుణ ప్రశ్నించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఈవీఎం బాక్స్ లను మార్చాలని చూసారన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అధికార పార్టీ టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు 75 కోట్ల మద్యం తాగించారని ఆమె మండిపడ్డారు.
Also Read
ఏడేళ్ళ పాలనలో దళితులకు ఏమి చేయని ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకం ను తీసుకువచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఒక్క ఓటుకు ఆరువేల రూపాయలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కంటెయినర్ లో హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు డబ్బులు పంపించి హుజురాబాద్ లో పంచారన్నారు.
హుజురాబాద్ పోలింగ్ ముందు మనిషికి ఆరువేలు.. ఓటు వేసే రోజు మళ్ళీ 10వేలు పంచారు. ఇన్నేళ్ళ పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేసి ఉంటే పైసలు ఎందుకు పంచాడని డీకె అరుణ ప్రశ్నించారు. డబ్బుతో ఎన్నికలలో గెలవాలని కేసీఆర్ చూస్తున్నాడని, కుక్కను నిలబెట్టిన గెలుస్తారని ముందు నుంచి కేసీఆర్ చెప్పారు. అధికారులు టీఆర్ఎస్ నేతల చెప్పు చేతుల్లో నడిచారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై సీబీఐ విచారణ చేపట్టాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. పని చేయని వీవీ ప్యాట్ కారులోకి ఎలా వెళుతుంది.స్ట్రాంగ్ రూమ్ లోనే ఉండాలి కదా అన్నారు అరుణ.
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!