హుజురాబాద్ ఫలితం.. ఇలా రియాక్ట్ అయిన మాణిక్యం ఠాగూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తున్నా.. మొత్తంగా మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నారు.. ఇక, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోతోంది.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ నడుస్తున్నా.. కాంగ్రెస్ లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఈ ఫలితాలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఇలా స్పందించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షిస్తామన్నారు మాణిక్కం ఠాగూర్… ఇక, పార్టీలో చర్చించిన తరువాతే ఈ విషయం పై స్పందిస్తామని స్పష్టం చేసిన ఆయన.. ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు నేను ఇంకా చూడలేదు అన్నారు.. ఆ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాతే స్పందిస్తానన్నారు. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలు కేవలం వారి ఊహలేనని వ్యాఖ్యానించిన ఠాగూర్.. అన్ని అంశాలపై పార్టీలో సమీక్ష చేసుకుని మాట్లాడదాం అన్నారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!