తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ హాట్ రాజకీయం నడుస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్కి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులోనే పడుకునే కేటీఆర్ ఆరు రోజుల తర్వాత నా ట్వీట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు.
నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కేసీఆర్ ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. పెట్రోల్ డీజిల్ లో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? కేటీఆర్.
అబద్ధాలు తప్ప నిజం చెప్పవా? పెట్రోల్ మీద 41 రూపాయలు తీసుకుంటుంది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే 41 రూపాయలు తీసుకోవద్దు. అబద్ధాలపై పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్ లే ముందుంటారు. పాతబస్తీలో ఇద్దరం కలిసి తిరుగుదాం. కేటీఆర్ నువ్వు ఒక గంట తిరిగితే బ్యాక్ పెయిన్ వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.