హుజురాబాద్ తర్వాత.. టీఆర్ఎస్ కు తలనొప్పులు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉప ఎన్నిక వేడి బాగా రాజుకుంది. మరో రెండురోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఆతర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. బలమైన స్థానంలో ఓటమి పాలయింది. దీంతో పతనం మొదలైపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే ఆవెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పట్టు నిలుపుకునేందుకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టీఆర్ఎస్ తన సత్తా చాటింది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
అంతా అయిపోయింది.. ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతోందని భావించిన సమయంలో అల్పపీడనంలా ఈటల రాజేందర్ ఎపిసోడ్ అలజడి రేపింది. ఈటల రాజీనామా, వెంట వెంటనే రాజీనామాకు ఆమోదం, ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో మళ్ళీ వేడి రాజుకుంది.
ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి కంటి మీద కనుకు లేకుండా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యావత్ తెలంగాణ ప్రభుత్వంలోని యంత్రాంగం అంతా హుజూరాబాద్లో తిష్ట వేసింది. గత ఆరునెలలుగా హుజురాబాద్ కేంద్రంగా రాజకీయాలు సాగుతూనే వున్నాయి. దుబ్బాక, సాగర్ ఒక ఎత్తయితే.. హుజూరాబాద్ మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిందనే చెప్పాలి.
మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్కు కొత్త తలనొప్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. హుజూరాబాద్లో దళితులను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ దళిత బంధు తెచ్చింది. వివిధ కారణాల వల్ల ఆ పథకం ఆగినా, దాని తాలూకు ప్రకంపనలు ఇతర నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ నియోజకవర్గాల్లోనూ తమకు ఉప ఎన్నిక కావాలనే డిమాండ్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఒకే.. కేసీఆర్పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు మౌనంగా వుంటారు. కానీ బీజేపీ అభ్యర్ధి ఈటల గెలిస్తే మాత్రం టీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రేగుతాయని అంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకుని కొందరు ఉపఎన్నికకు వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఉప ఎన్నిక జరిగే ప్రాంతాలపై సీఎం కేసీఆర్ వరాలు, నిధుల వరద కురిపించడంతో తమ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు వస్తే బాగుండనని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే వైరల్ అవుతోంది. ఎన్నికలు వస్తేనే మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి.
అభివృద్ధి జరుగుతుందని జనం అభిప్రాయపడుతున్నారు. కొత్త పథకాలు తెరమీదకు రావాలన్నా, ఎన్నికల సందర్భంగా తమకు బిర్యానీ, డబ్బులు, ఇతర తాయిలాలు అందాలన్నా ఉప ఎన్నికే కావాలంటున్నారు. తమ ఎమ్మెల్యేనో ఎంపీనో తమ పదవికి రాజీనామా చేస్తే బాగుండేదని జనం అభిప్రాయపడడం, ఫ్లెక్సీలతో సందడి చేయడం నయా పాలిటిక్స్ కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఎమ్మెల్యేల ఫోటోలతో ఫ్లెక్సీలు అక్కడక్కడా దర్శనం ఇస్తున్నాయి. నియోజకవర్గంలో మీరు మా మీద ప్రేమతో రాజీనామా చేయండి. అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. మాకు కొత్త పథకాలు వస్తాయి. మా ఊళ్ళు బాగుపడతాయంటూ జనం డిమాండ్ చేస్తున్నారు.
ఇల్లందు, భువనగిరితో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎమ్మెల్యేలపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గోషామహల్ ఉప ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. గోషా మహల్ ప్రజల కోసం తన పదవిని త్యాగం చేస్తానంటున్నారు రాజాసింగ్. ఇలాంటి డిమాండ్లు మరింత పెరిగితే అధికార పార్టీకి, రాష్ట్ర ఖజానాకు ఇబ్బందులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీ అనుసరిస్తారో చూడాలి.
- Tags
- BJP vs TRS
- EETALA
- huzurabad
- kcr
- ktr
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!