కొమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కు నేడు విరామం ఇచ్చారు. అయితే ఇవాళ ఉగాది పండుగ జరుపుకునేందుకు ఆయన పీపుల్స్ మార్చ్కు కాస్త విరామం ఇచ్చారు. పండుగను ఆదివాసీల మధ్య కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోనున్నారు.
మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదని ఆదివాసీయులు భట్టి విక్రమార్కకు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆరవ రోజు భట్టి పాదయాత్ర సందర్భంగా కొమురం భీం జిల్లా బూసి మెట్టలో ఆదివాసీలతో భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరుకుంది. ఇవాళ భట్టి పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. నేడు కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది.
టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.