Bhatti vikramarka: బెల్లంపల్లి లో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయండి.. భట్టికి విద్యార్థుల వినతి పత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బెల్లంపల్లి నుంచి లంబాడ తండా బట్వాన్ పల్లి, పెరకపల్లి, గుండ్ల సోమవారం, నార్వాయిపేట, మెట్పల్లి వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది. మధ్యాహ్నం పెరకపల్లిలో లంచ్ బ్రేక్ అనంతరం రాత్రికి మెట్పల్లిలో బస చేయనున్నారు. ఈనేపథ్యంలో.. మంచిర్యాలలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకోగా.. భట్టిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. వారికి ష్కాలర్ షిప్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవనం సరిపోవడం లేదని తెలిపారు. హాస్టల్ భవనం ఇక్కడకు రెండు కిలోమటర్ల దూరంలో ఉంటుందని భట్టితో పేర్కొన్నారు. అక్కడనుంచి ఇక్కడకు ప్రతిరోజూ నడుచుకుంటూ రావాలంటే ఇబ్బందిగా ఉందని విద్యార్థులు భట్టితో తెలిపారు.
Read also: Postpartum Depression : ప్రసూతి నిర్వేదం(పోస్ట్ పార్టమ్ డిప్రెషన్) లక్షణాలు… అధిగమించండిలా…
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
ఇక్కడే మాకు హాస్టల్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ 800 మంది విద్యార్థులు చదువుతున్నారని, సరైన టాయిలెట్లు లేవు. ల్యాబ్ సౌకర్యం లేదు, గ్రౌండ్ లేదని ఆవదేన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల వరండాల్లోనే చదువుకోవాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు బస్ సదుపాయం లేకపోవడం కాలేజీ వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. తాగేందుకు మంచి నీటి వసతి లేదు. అంతేకాక బెల్లంపల్లిలోనే పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని విద్యార్థునులు భట్టికి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్యానికి నిధులు వెచ్చించడం లేదని మండిపడ్డారు. కొత్త కాలేజీలే ఏర్పాటు చేయడం లేదని, కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ ఐఐటీ, త్రిపుల్ ఐటీలు, కొత్త కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు.
Shakuntalam: ఇంతందం కనిపిస్తుంటే అభిమానుల మనసు నిలుపతరమా?
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..