Bhatti vikramarka: బెల్లంపల్లి లో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయండి.. భట్టికి విద్యార్థుల వినతి పత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బెల్లంపల్లి నుంచి లంబాడ తండా బట్వాన్ పల్లి, పెరకపల్లి, గుండ్ల సోమవారం, నార్వాయిపేట, మెట్పల్లి వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది. మధ్యాహ్నం పెరకపల్లిలో లంచ్ బ్రేక్ అనంతరం రాత్రికి మెట్పల్లిలో బస చేయనున్నారు. ఈనేపథ్యంలో.. మంచిర్యాలలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకోగా.. భట్టిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. వారికి ష్కాలర్ షిప్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవనం సరిపోవడం లేదని తెలిపారు. హాస్టల్ భవనం ఇక్కడకు రెండు కిలోమటర్ల దూరంలో ఉంటుందని భట్టితో పేర్కొన్నారు. అక్కడనుంచి ఇక్కడకు ప్రతిరోజూ నడుచుకుంటూ రావాలంటే ఇబ్బందిగా ఉందని విద్యార్థులు భట్టితో తెలిపారు.
Read also: Postpartum Depression : ప్రసూతి నిర్వేదం(పోస్ట్ పార్టమ్ డిప్రెషన్) లక్షణాలు… అధిగమించండిలా…
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
ఇక్కడే మాకు హాస్టల్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ 800 మంది విద్యార్థులు చదువుతున్నారని, సరైన టాయిలెట్లు లేవు. ల్యాబ్ సౌకర్యం లేదు, గ్రౌండ్ లేదని ఆవదేన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల వరండాల్లోనే చదువుకోవాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు బస్ సదుపాయం లేకపోవడం కాలేజీ వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. తాగేందుకు మంచి నీటి వసతి లేదు. అంతేకాక బెల్లంపల్లిలోనే పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని విద్యార్థునులు భట్టికి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్యానికి నిధులు వెచ్చించడం లేదని మండిపడ్డారు. కొత్త కాలేజీలే ఏర్పాటు చేయడం లేదని, కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ ఐఐటీ, త్రిపుల్ ఐటీలు, కొత్త కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు.
Shakuntalam: ఇంతందం కనిపిస్తుంటే అభిమానుల మనసు నిలుపతరమా?
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!