Bhatti Vikaramarka : దేశ సంపదను ప్రధాని మోడీ క్రోనీ క్యాపిటలిస్ట్లకు దోచిపెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసు పెట్టి సూరత్ కోర్టులో జైలు శిక్ష పడేలా చేసి, కోర్టు శిక్ష వేసిందన్న సాకుతో 2 సంవత్సరాల పాటు పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం మోడీ అమిత్ షా బీజేపీ నాయకత్వంలో జరిగిన కక్ష సాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాల బిజేపి పరిపాలనలో దేశ సంపదను ప్రధాని మోడీ క్రోనీ క్యాపిటలిస్ట్ లకు దోచిపెడుతున్నారని, ప్రజల సంపద ప్రజలకే చెందాల్సిన ఈ దేశంలో ప్రధాని మోడీ ఆదానికి దోచిపెడుతుంటే గొంతెత్తి ప్రశ్నించిన రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడానికే బిజెపి ప్రభుత్వం బహిష్కరణ కుట్రకు పాల్పడిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ సంపద దోపిడీకి గురవుతుందని పార్లమెంటు లోపల, బయట రాహుల్ గాంధీ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని బీజేపీ తప్పుడు విమర్శలు చేసిందన్నారు.
Also Read : Earth Hour: రాత్రి 8.30 గంటలకు ‘ఎర్త్ అవర్’.. అంటే ఏంటీ?
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
రాహుల్ గాంధీ చెబుతున్నది నిజమేనని అమెరికాకు చెందిన హిండేన్ బర్గ్ సంస్థ ఆదాని దోపిడీ చేసిన ఆర్థిక నేరం గుట్టును రట్టు చేసి ఆదానీ ఈదేశాన్ని కాదు, ప్రపంచాన్ని సైతం మోసం చేశాడని బయటపెట్టిందని, దేశాన్ని దోపిడీ చేస్తున్న బిజెపి ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు దేశంలో హిందూ, ముస్లిం విభజన పేరిట ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుంటే కాంగ్రెస్ కలలు కన్న దేశం ఇది కాదంటూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో చేశారన్నారు. భారత్ జోడో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీకి దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి పెరిగిన ఆదరణతో రానున్న ఎన్నికల్లో ప్రధాని అవుతాడన్న భయంతోనే మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నదని ఆయన అన్నారు.
Also Read : Buffalo Seized: ఇదేందయ్యో.. నీటి పన్ను బకాయి ఉందని గేదెను తీసుకెళ్లారు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ బహిష్కరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దేశభక్తులమైన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు నినదించి కదం తొక్కుతారని ఆయన మండిపడ్డారు. మతం పేరిట దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలని చూస్తున్న బీజేపీ, రాహుల్ గాంధీ పోరాటం మనందరిది. అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేశ సమైక్యత , సమగ్రత, ఔలత్యం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ లా వారసుడు ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు భయపడడని మోడీ గ్రహించాలని, రాహుల్ గాంధీ కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడం, కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ద్రోహి ఎమ్మెల్యే సక్కుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!