Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka Fires On CM KCR In Tandoor Corner Meeting: నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం.. ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని, ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. తాండూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 198 ఇళ్లు పంపిణీ చేశామని.. అయితే ఇప్పటివరకు ఆ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తాండూరు మండలంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. మూడు ఎకరాల భూ పంపిణీ చేయకుండా కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో ఇంటికో కొలువు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు.
Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
Also Read
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
నాలుగున్నర కోట్ల ప్రజలకు చెందాల్సిన తెలంగాణ సంపదను.. కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు పంచుకొని తింటుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రజల్ని ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన 18లక్షల కోట్లు.. అలాగే ప్రజలందరిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.5 లక్షల కోట్లు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఆ డబ్బులతో ఇళ్లు కట్టారా? ఉద్యోగాలు ఇచ్చారా? నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమీ చేయకుండా ఆ డబ్బులను ఏం చేశారని అడిగారు. రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం, అది చేయకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పు తెచ్చి సాగు చేసి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ మైనింగ్ వనరులను ఆంధ్రాకు చెందిన బడాబాబు కంపెనీలకు కేసీఆర్ ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మన కొలువులు మనకే.. మన వనరులు, సంపద మనకే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. 1.15 లక్షల మంది పనిచేస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసి, 60వేల ఉద్యోగాలు తొలగించే కుట్ర జరుగుతోందని వెల్లడించారు.
Revanth Reddy: పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మన కొలువులు మనమే చేసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని మాటిచ్చారు. అంతేకాదు.. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తామన్నారు. తెలంగాణ సంపదను కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాత్రమే ఖర్చు పెడతామని తెలియజేశారు.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!