పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఫ్యాక్టరీ తరలింపు నిర్ణయాలు ఉండచ్చు. చిత్తూరు జిల్లాకు సేవ చేయాలని అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను అని అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు అన్నారు. హైకోర్టులో ఉన్న కేసులపై మాట్లాడటం కరెక్ట్ కాదు. 36 ఏళ్ళుగా ఎంతో నిబద్ధతతో కంపెనీ అభివృద్ధి చేశాము. వేలాదిమందికి ఉద్యోగం అవకాశాలు కల్పించాము. నేను రాజకీయ నాయకుడ్ని కాదు… నేను వ్యాపార వేత్తను… సమాజసేవ కుడిని మాత్రమే అని తెలిపారు. ఇక గల్లా జయదేవ్…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగావున్నప్పుడు జరిగిన ఆందోళనలు నిరసనలు కొన్ని ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి దాఖలైన 11 కేసులను రద్దుచేయడంపై హైకోర్టు జడ్జి కె.లలిత సుమోటాగా విచారణ చేపట్టడం ఇప్పుడు తాజా వివాదంగా వుంది. ప్రభుత్వాలు మారినపుడు అంతకు ముందరి సాధారణ కేసులు కొన్ని రద్దు చేయడం జరుగుతుంటుంది.వాటినిప్రతిపక్షం ఆక్షేపించడం కూడా జరుగుతుంటుంది గాని ఇక్కడ హైకోర్టు సుమోలాగా తనకు తాను తీసుకోవడవంపైనే ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది.ఈ కేసుల రద్దులో కొన్ని ప్రభుత్వ జీవోల ద్వారానూ…
కోర్టు ధిక్కరణ అంశంలో ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఐఏఎస్ అధికారి గౌరీ శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో స్పష్టం చేసింది హైకోర్టు.. అయితే, ఆ దేశాలను అమలు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. అయితే.. కోర్టు ఆదేశాలు…
గ్రూప్-1 పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గ్రూప్-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ 4 వారాల పాటు నిలిపివేయాలని స్టే విధించింది.. రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.. కాగా, గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. ఇక, దీనిపై మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోపవాదలు జరగగా.. ఇరుపక్షాల వాదనలు విన్న…
మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా టిడిపి మాజీ మంత్రి అశోక్గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని…
మాన్సాస్ ట్రస్ట్పై హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్.. హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంకా, కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదు.. దీనిపై అప్పీల్కు వెళ్తామని తెలిపారు.. ఇక, మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసిన ఆయన.. తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా వస్తాయి, ఒక్కోసారి వ్యతిరేకంగా వస్తాయని వ్యాఖ్యానించారు.. మరోవైపు లోకేష్ కామెంట్లపై స్పందించిన మంత్రి.. లోకేష్ చిన్నవాడు కాదు.. పెద్దవాడు కాదు.. ట్వీట్ల బాబుగా తయారు…
ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ…
అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు.. గుజరాత్లోని అమూల్కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ…
ఆనందయ్య మందు పంపిణీపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సందర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్రభుత్వం కాసేపట్లో సమీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్రభుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ సమీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని…