ప్రజల ప్రయోనాల కోసం సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను రద్దు చేస్తూ తీర్పనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో హత్య చేసినట్లు సీబీఐ ముందు దస్తగిరి వాగ్మూలం ఇచ్చాడు. అయితే ఈ కేసులో కేసులో దస్తగిరికి క్షమాభిక్ష ఇస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐకు ఆ అధికారం లేదంటూ గంగిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో…
ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. గత శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో నేడు ఆయనను సీఐడీ తమ ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు సీఐడీ అధికారులు ముందు హజరుకావల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు పిటిషన్ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.…
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవనాన్ని గ్రౌండ్+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర…
కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా డీఈవో కె.శామ్యూల్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో గానీ, అనాథాశ్రమంలో గానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాకుండా, కోర్టును అవమానించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. Read Also: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. అంతేకాకుండా జగన్న విద్యా దీవెన పథకం పై కూడా కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్ కోటాలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ,…
ఆంధ్రప్రదేవ్లో పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది డివిజన్ బెంచ్.. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు.. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు సింగిల్ బెంచ్… అయితే, సింగిల్ బెంచ్…
మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇప్పటికే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని… ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు విన్నవించారు. అయితే, రాజధాని కేసులపై సోమవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం. Read Also: కలవరపెడుతోన్న కోవిడ్ కొత్త…
శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం…