Home
Ap High Court
Ap High Court News
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
Simhachalam Temple Land: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దేవస్థానం భూముల బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలోని సర్వే నంబర్ 275, ముదసర్లోవ గ్రామంలోని సర్వే నంబర్ 26 పరిధిలో ఉన్న మొత్తం 160 ఎకరాల దేవాదాయ… -
Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
Gangamma Lockup Death Case: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ ఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దుర్గప్పకు అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని నివేదికలను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పించారు. కోర్టు ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు పలు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రక్రియలు పూర్తైన వెంటనే ఎన్నికలు… -
AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
AP High Court: ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై కోర్టు తీవ్ర అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సరెండర్ కావడం ఆయనకు మంచిదని సూచించింది. విచారణ సందర్భంగా “ఎప్పటిలోగా సరెండర్ అవుతారు?” అని కోర్టు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. కేసు వివరాలను పరిశీలించిన అనంతరం, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పిటిషనర్… -
AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!
దేవాలయ ఆచారాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భగుడిలోకి ప్రవేశించరాదన్న అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజలు నిర్వహించకూడదని కోర్టు పేర్కొంది. పూజా కార్యక్రమాల్లో సంప్రదాయ నిబంధనలు కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. 2010 నవంబర్ 10న దేవాదాయ శాఖ జారీ చేసిన సర్కులర్ను అమలు చేయాలని సూచించింది. అలాగే 2024 డిసెంబర్… -
AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!
తన భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేయడానికి పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యపై ఆరోపణలను నిరూపించడానికి పిల్లలను పావులుగా ఉపయోగించడం సరైంది కాదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు ఇతర ఆధారాలను సేకరించాల్సిందే గానీ, పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరకూడదని తేల్చి చెప్పింది. Also Read: AP High… -
AP High Court: ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలకు పాల్పడితే.. అది సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు… -
AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో… -
AP High Court: సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం
AP High Court: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు కొన్ని కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.. సునీల్ నాయక్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం, ఆయనకు తక్షణ ఉపశమనం కలిగిస్తూనే కొన్ని షరతులను విధించింది. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ లోపల… -
AP High Court: హైకోర్టు ఆదేశాలు పాటించని ఏపీ సీఎస్.. తీవ్రంగా మండిపడిన న్యాయస్థానం
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ విజయానంద్ ని సూటిగా ప్రశ్నించింది. దీంతో ఖచ్చితంగా చేస్తామని కోర్టుకు సీఎస్ తెలిపారు.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!