Home
Ap High Court
Ap High Court News
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
AP High Court: విశాఖ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా సెంటర్కు సంబంధించిన నిర్మాణ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు లోబడి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను హైపర్ స్కేల్… -
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
AP High Court: కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో విచారణకు ముందు రోజు లేదా విచారణ జరిగే రోజే కౌంటర్లు, నివేదికలు దాఖలు చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ విధానం సరైనది కాదని స్పష్టం చేసింది.… -
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్పై జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అదే… -
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
AP High Court: పోలీసులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొమ్మారెడ్డి అవినాష్ రేంజర్ ప్లే యాప్ సహాయంతో రూ.37 కోట్లు దారి మళ్లించారన్న కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి మూడేళ్లు గడిచినా దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందని నిలదీసింది.… -
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
AP High Court: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలు వివాదంగా మారాయి.. దీనిపై పాలక, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుండగా.. డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని… -
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
Single-Teacher Schools: ఆంధ్రప్రదేశ్లో సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. తక్కువ మంది ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తుండటంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని, దీనివల్ల వారి విద్యా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 6వ తరగతి నుంచి 8వ తరగతి… -
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న సీఐ నాగరాజు, తనపై నమోదైన హత్య కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు, తన అరెస్టు చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో నాగరాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తనపై… -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే.. కొన్ని షరతులు విధించింది హైకోర్టు.. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, నిర్దిష్ట షరతులతో వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే… -
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషన్ ఉపసంహరణకు గల పూర్తి కారణాలను కోర్టుకు వివరించాలని పిటిషనర్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని ఆదేశించింది. సాయి కృష్ణ అదృశ్యమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని… -
AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
AP High Court: విశాఖపట్నంలోని రుషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం భవనాల వినియోగానికి సంబంధించి కేవలం ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాల వినియోగాన్ని ప్రశ్నిస్తూ విశాఖకు చెందిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు…
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!