Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
కర్నూలు దారుణంః ఒకే కుటుంబంలో…
కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జలదిగ్బంధంలో పోలవరం ముంపు ప్రాంతాలు
తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగునీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా దేవీపట్నం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరంలో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
తమ గెలుపులో కీలకమైన నేతలని పక్కన పెడుతున్న ఆ ఎమ్మెల్యేలు..
ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వారంతా కింగ్లు. రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. పరిస్థితులు మారడంతో మరొకరి గెలుపు కోసం పనిచెయ్యాల్సి వచ్చింది. చెప్పిన పని చెప్పినట్లు పూర్తి చేశారు. గెలిచినవారు మాత్రం వారిని పట్టించుకోవడం మానేశారట. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా? భవిష్యత్ బాగుంటుందని గెలుపునకు కృషి చేశారుఎన్నికల్లో కలిసి తిరిగిన వారిని దూరం పెట్టిన ఎమ్మెల్యేలు! రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ సునామీ సృష్టించింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కూడా… -
కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే జల దోపిడీ తెరపైకి..!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది… -
కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ.. ఏపీపై ఫిర్యాదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్ను భేఖాతర్ చేస్తుందని కేఆర్ఎంబీకి రాసిన… -
సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్పందించిన ఏపీ మంత్రి ఆదిమూలపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు… -
ఏపీ సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!
ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం… -
ఏపీ బీజేపీలో లీకువీరులు..!
ఏపీలో బీజేపీకి ఓ సరదా సమస్య వచ్చి పడింది. ముఖ్యనేతల మీటింగ్లో అంతర్గత వ్యవహారాల చర్చ బయటకు వెళ్లిపోతుందట. పార్టీలో లోటుపాట్లు, నేతలకు అక్షింతలు సైతం మీడియాలో రావడంతో తలనొప్పిగా మారిందట. దీంతో పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట. మీటింగ్ అంశాలు ఎవరూ బయట మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నంత పని చేస్తున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పార్టీ మీటింగ్లకు రహస్యం అవసరమని భావిస్తున్నారా? ఏపీ… -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పాల్గొనగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం ప్రోగ్రెస్ లో… -
తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల…
తాజావార్తలు
-
Pahalgam Attack: ఎన్ఐఏ ఛార్జ్షీట్లో సూత్రధారిగా హఫీజ్ సయీద్.. పాక్ కుట్రపై కీలక విషయాలు
-
Divija Prabhakar: “నేను జెన్జీ ముసల్దాన్ని.. ఆ ఖర్చులన్నీ దాస్తే ఇంకో ఇల్లు కొనేవాళ్లం”: దివిజ ప్రభాకర్
-
Netanyahu: ఇజ్రాయెల్కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్తో అమెరికా షాక్..
-
Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!