Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
- ఆస్తి వివాదంతో తీవ్ర మనస్తాపం
- భార్యకు వీడియో కాల్ చేసి ఘోర నిర్ణయం
- కాజీపేట రైల్వే ట్రాక్పై విషాదం
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన జీఆర్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide on Video Call : వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేపే ఘోర సంఘటన వెలుగుచూసింది. మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన భార్యకు మొబైల్లో వీడియో కాల్ చేసి, తానేం చేయబోతున్నాడో లైవ్లో చూపిస్తూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి సదరు భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేష్ నాయక్ (45) గా గుర్తించారు. గత కొంతకాలంగా రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై తీవ్రస్థాయిలో మనస్పర్థలు, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఈ వ్యవహారం సర్దుమణగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆస్తి పంపకాల విషయమై భార్యతో రాజేష్ నాయక్కు తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
- Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
- Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆగ్రహంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు.ఇంట్లోంచి నేరుగా కాజీపేట రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకున్న రాజేష్ నాయక్.. రాత్రి వేళ తన భార్యకు స్మార్ట్ఫోన్ ద్వారా వీడియో కాల్ చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్యకు చెబుతూ.. కదిలివస్తున్న రైలు కింద పడి క్షణాల వ్యవధిలో తనువు చాలించారు. ఫోన్ కట్ చేసే లోపే ఈ ఘోరం జరిగిపోవడంతో భార్య కేకలు వేస్తూ బంధువులకు సమాచారం అందించారు. ఈ లోగా సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం (GRP) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల వల్ల ఒక నిండు ప్రాణం ఇలా అర్ధాంతరంగా రైలు పట్టాలపై బలికావడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!