Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Summer: అలర్ట్.. ఎండాకాలం మొదలైపోయింది..!!
తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2… -
Maha Shivaratri: శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనుండగా.. మార్చి 4 వరకు అంటే 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇక, ఈ నెల 23 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తామని, దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఉంటుందని.. మొదటిసారి… -
RIP Mekapati Goutham Reddy: నేడు నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం..
హైదరాబాద్లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని నివాసంలో గౌతమ్రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
✪ నేటి నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉ.8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం.. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం✪ ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేవీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయం తరలింపు..… -
Chandrababu: జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్..!
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా… -
Mekapati Goutham Reddy Funeral: అంత్యక్రియల స్థలం మారింది..
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. అయితే, ముందుగా ప్రకటించినట్టుగా ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కాకుండా.. మరోచోట అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే గౌతమ్రెడ్డి భౌతిక కాయం ఉండగా.. రేపు ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు..… -
AP High Court: జడ్జీలను దూషించిన కేసు.. యుట్యూబ్పై హైకోర్టు సీరియస్
సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్ పై సీరియస్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొత్త టెక్నిక్తో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది అశ్వని కుమార్… అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు.. ప్రైవేట్ వ్యూస్ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్లో పేర్కొన్నారు.. Read Also: Goutham Reddy passes… -
Goutham Reddy passes away: మృతిపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ
ఆంధ్రప్రదస్త్రశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయాయి.. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వదంతులపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది.. ఆయన వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేసింది.. రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన ఉదయం ఇబ్బంది పడడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించేవరకు జరిగిన అన్ని విషయాలను… -
Anil Kumar: సొంత అన్నను కోల్పోయినట్టు ఉంది.. వివాదాలులేని వ్యక్తి మేకపాటి..
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠన్మారణంతో ఏపీ విషాదంలో మునిగిపోయింది.. ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనవుతున్నాయి… సీఎం వైఎస్ జగన్ సహా.. మంత్రులు, నేతలు.. హైదరాబాద్కు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.. మేకపాటి భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ కూడా వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్రెడ్డి అని పేర్కొన్న ఆయన.. ఎప్పుడూ నవ్వే వ్యక్తి ఆయన అని గుర్తుచేసుకున్నారు..… -
Photos: గౌతంరెడ్డి పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!