TDP: అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం.. చంద్రబాబు మాత్రం రారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.. మొదట పొలిట్బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే మొగ్గు చూపారు సభ్యులు… అయితే, చంద్రబాబు మాత్రం సభకు హాజరు కావడంలేదు.. చంద్రబాబు మినహా.. అసెంబ్లీకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సభకు వెళ్లకూడదని పొలిట్ బ్యూరో దాదాపు నిర్ణయం తీసుకున్నా.. పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కూడా కాదని అసెంబ్లీకి వెళ్లడానికే మొగ్గు చూపారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున సమస్యలు, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న క్రమంలో బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు సూచించారు.
Read Also: Minister Appalaraju: అది అమరావతి కాదు.. ‘కమ్మ’రావతి..
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజా సమస్యల పై చర్చ కోసం సభకు వెళ్తామంటున్నారు టీడీపీ సభ్యులు.. ప్రజా సమస్యలపై చర్చకు పలు డిమాండ్లను బీఏసీలో ప్రస్తావించనున్నారు.. బీఏసీలో ప్రభుత్వం స్పందించే వైఖరిని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్టు టీడీపీ నేతులు చెబుతున్నారు.. అమరావతి, పోలవరం, రైతుల సమస్యలపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు.. సభలో వైసీపీ ఏకపక్షంగా వెళ్లకుండా అడ్డుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సభలోనే సీఎం వైఎస్ జగన్ను నిలదీయాలని టీడీపీ సభ్యులు అభిప్రాయడడంతో.. సభకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?