Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
- యువ పేసర్ క్రాంతి గౌడ్కు 5 వికెట్లు
- లార్డ్స్లో ఇంగ్లాండ్ 170 ఆలౌట్
- తొలి మహిళా బౌలర్గా క్రాంతి గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kranti Gaud 5 Wickets at Lord’s Test: భారత మహిళా క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్గా రికార్డుల్లో నిలిచింది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఈ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. అంతేకాకుండా ఈ చారిత్రక వేదికపై ఏ ఫార్మాట్లోనైనా ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా కూడా నిలిచింది.
కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న 22 ఏళ్ల క్రాంతి గౌడ్.. లార్డ్స్ టెస్టులో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే క్రాంతి గౌడ్ తన జోరును కొనసాగించింది. నాలుగో బంతికే మయా బౌచియర్ను ఔట్ చేసింది. తొలి రోజే ఇంగ్లండ్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టామీ బ్యూమాంట్ను క్రాంతి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపింది.
Also Read
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
- Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
- FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ క్రాంతి గౌడ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. అలీస్ క్యాప్సీని అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసిన క్రాంతి.. ఇంగ్లండ్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. హీథర్ నైట్ కూడా తొలి సెషన్లోనే ఔట్ కావడంతో ఆతిథ్య జట్టు 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాట్ స్కివర్-బ్రంట్, అమీ జోన్స్ కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అమీ జోన్స్ను స్నేహ్ రాణా ఔట్ చేయడంతో ఆ భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ తర్వాత మళ్లీ బౌలింగ్కు వచ్చిన క్రాంతి.. ఇంగ్లండ్ కెప్టెన్ స్కివర్-బ్రంట్ను పెవిలియన్కు పంపి కీలక దెబ్బ కొట్టింది. అనంతరం లారెన్ బెల్ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తన సత్తా చాటింది. అర్ధశతకంతో రాణించి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. షఫాలీ వర్మ 33 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మంధాన 69 పరుగులతో, యాస్తికా భాటియా 39 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిక్యం 269 పరుగులకు చేరుకుంది. మూడో రోజు ఈ ఆధిక్యాన్ని 400 పరుగులకు పైగా తీసుకెళ్లి ఇంగ్లండ్పై చారిత్రక విజయాన్ని సాధించాలని భారత మహిళల జట్టు చూస్తోంది. క్రాంతి గౌడ్ చారిత్రక ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక టెస్టులో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!