Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
- యువ పేసర్ క్రాంతి గౌడ్కు 5 వికెట్లు
- లార్డ్స్లో ఇంగ్లాండ్ 170 ఆలౌట్
- తొలి మహిళా బౌలర్గా క్రాంతి గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kranti Gaud 5 Wickets at Lord’s Test: భారత మహిళా క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్గా రికార్డుల్లో నిలిచింది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఈ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. అంతేకాకుండా ఈ చారిత్రక వేదికపై ఏ ఫార్మాట్లోనైనా ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా కూడా నిలిచింది.
కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న 22 ఏళ్ల క్రాంతి గౌడ్.. లార్డ్స్ టెస్టులో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే క్రాంతి గౌడ్ తన జోరును కొనసాగించింది. నాలుగో బంతికే మయా బౌచియర్ను ఔట్ చేసింది. తొలి రోజే ఇంగ్లండ్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టామీ బ్యూమాంట్ను క్రాంతి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపింది.
Also Read
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
- US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ క్రాంతి గౌడ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. అలీస్ క్యాప్సీని అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసిన క్రాంతి.. ఇంగ్లండ్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. హీథర్ నైట్ కూడా తొలి సెషన్లోనే ఔట్ కావడంతో ఆతిథ్య జట్టు 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాట్ స్కివర్-బ్రంట్, అమీ జోన్స్ కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అమీ జోన్స్ను స్నేహ్ రాణా ఔట్ చేయడంతో ఆ భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ తర్వాత మళ్లీ బౌలింగ్కు వచ్చిన క్రాంతి.. ఇంగ్లండ్ కెప్టెన్ స్కివర్-బ్రంట్ను పెవిలియన్కు పంపి కీలక దెబ్బ కొట్టింది. అనంతరం లారెన్ బెల్ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తన సత్తా చాటింది. అర్ధశతకంతో రాణించి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. షఫాలీ వర్మ 33 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మంధాన 69 పరుగులతో, యాస్తికా భాటియా 39 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిక్యం 269 పరుగులకు చేరుకుంది. మూడో రోజు ఈ ఆధిక్యాన్ని 400 పరుగులకు పైగా తీసుకెళ్లి ఇంగ్లండ్పై చారిత్రక విజయాన్ని సాధించాలని భారత మహిళల జట్టు చూస్తోంది. క్రాంతి గౌడ్ చారిత్రక ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక టెస్టులో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది.
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!