Nadendla Manohar: వ్యక్తిగతంగా నష్టపోయినా పవన్ కల్యాణ్ పోరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన.. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ముందు నిండు మనస్సుతో సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామన్న రైతులు.. కాసేపటికే స్థలం ఇవ్వలేమని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారన్నారు.. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు మనోహర్.
Read Also: AP Capital: ఒకటికి 10 సార్లు చెబుతున్నాం.. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం..
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఇక, వైఎస్ జగన్ పాలనపై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించుకోవాలని సూచించారు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వంలో చాలా మంది అహంకారంతో పని చేస్తున్నారన్న ఆయన.. ప్రజలు నిండు మనస్సుతో 151 సీట్లు ఇస్తే.. పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు.. చాలా మంది పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శించారు. మరోవైపు, అమరావతిపై హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు మనోహర్.. ఓ ఉద్యమ గళాన్ని వినిపించకుండా చేయాలనుకున్న ప్రభుత్వ పిచ్చి భ్రమను కోర్టు తన తీర్పుతో తొలగించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో ఏపీ చాలా నష్టపోయిందన్న ఆయన.. ప్రభుత్వం రాజధాని రైతులను ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. ఇక, అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపిన ఆయన.. ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారో మీరే చూస్తారు.. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారోననేది స్పష్టం చేస్తారని తెలిపారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతోందో స్పష్టంగా చెబుతామన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జగన్ నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ అంటున్నారు.. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు.. కానీ, సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శలు గుప్పించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!