వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి.. అసెంబ్లీలో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న ఆయన.. గతంలో టీడీపీలా కాకుండా మేం ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నాం అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి సమావేశాల నుండి వెళ్లిపోయారని విమర్శించిన ఆయన… ఇప్పుడు టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరుకావాలని సూచించారు.
Read also: Nadendla Manohar: వ్యక్తిగతంగా నష్టపోయినా పవన్ కల్యాణ్ పోరాటం..!
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చేయాలని అనుకుంటున్నారంటూ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు శ్రీకాంత్రెడ్డి.. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలన్నా ఆయన.. ఇక, వైఎస్ వివేకా హత్య పై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దానిపై కూడా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అసెంబ్లీ అధికారులపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారని.. దీనిపై బీఏసీలో చర్చించాలని కోరతాం అన్నారు.. అసెంబ్లీకి ఉన్న హక్కులపై కూడా చర్చించాలని భావిస్తున్నట్టు తెలిపారు శ్రీకాంత్రెడ్డి.