Minister Appalaraju: అది అమరావతి కాదు.. ‘కమ్మ’రావతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు తర్వాత.. రాజధాని అమరావతి మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. అదే తమ విధానం అంటూ స్పష్టం చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. అతి అమరావతి కాదు కమ్మరావతి అని దుయ్యబట్టారు. మూడు రాజధానులకు చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఆర్డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కానీ, తమ విధానం వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారన్న ఆయన.. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా.. అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు.
Read Also: Petrol Price: టెన్షన్ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
అభివృద్ధి వికేంద్రీకరణ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోనే ఉందన్నారు మంత్రి అప్పలరాజు.. రాజధానిని వికేంద్రీకరించి విశాఖపట్నంలో సెక్రటేరియట్ కట్టిస్తాం తద్వారా కార్య నిర్వాహక రాజధానిని చేస్తామన్న ఆయన.. అమరావతిలో ఉన్న అసెంబ్లీని కొనసాగించి లెజిస్లేటివ్ కేపిటల్గా చేస్తాం.. కర్నూల్లో హైకోర్టును కట్టి న్యాయ నిర్వాహక రాజధానిగా రాయలసీమను చేస్తామన్నారు.. ఇక, అమరావతి నిర్మాణానికి 53 వేల ఎకరాలు (ప్రభుత్వ భూమితో కలిపి) చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చేశారన్న ఆయన.. భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం పరిహారం ఇవ్వాలట.. ఇది చంద్రబాబు స్కీమ్ కాదు స్కామ్ అంటూ ఆరోపణలు గుప్పించారు.. రియల్ ఎస్టేట్ కారణంగా 5 లక్షల ఎకరాల భూములు పనికి రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… మూడు రాజధానుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులే తమ విధానమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా చెబుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలకాలన్నారు.. వికేంద్రీకరణ ముద్దు… కమ్మరావతి వద్దు అని మంత్రి అప్పలరాజు ఈ సందర్భంగా నినాదాలు చేశారు..
తాజావార్తలు
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్లో భారీ ఆపరేషన్కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
-
Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
-
Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. ‘దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!