Venu Goapl Reddy
Author- NTV Telugu-
Sensex: ఆల్-టైమ్ హైకి సెన్సెక్స్.. 200 పాయింట్లకు చేరిన నిఫ్టీ
Sensex: భారత మార్కెట్లు ఆల్-టైం హైకి చేరుకున్నాయి. శుక్రవారం రోజు సెన్సెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలకు మించిన తర్వాత బలమైన డిమాండ్పై ఆందోళనలు తగ్గించడంతో లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై 72,600 పాయింట్లను తాకింది. నిఫ్టీ 200 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1.22 శాతం జోడించి 21,911 పాయింట్లకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 12.36 గంటల సమయానికి 1.31 శాతం పెరిగి 72,661 వద్దకు చేరుకుంది. -
Most Valuable Company: అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ని అధిగమించిన మైక్రోసాఫ్ట్..
Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది. -
Vande Bharat: వందేభారత్ ఆహారంలో దుర్వాసన.. ప్రయాణికుడి పోస్టుకు స్పందించిన రైల్వేశాఖ..
Vande Bharat: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇటీవల ప్రయాణికులు వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అంత నాణ్యతగా ఉండటం లేదు. గతంలో పలువురు ప్రయాణికులు ఆహారం విషయమై ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రైలులో ఇచ్చిన భోజనం దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైంది. -
Parliament’s Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబవరి 1న మధ్యంతర బడ్జెట్.!
Parliament's Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రారంభమవుతుంది. -
Manipur: మణిపూర్లో కిడ్నాప్కి గురైన నలుగురిని హత్య చేసిన మిలిటెంట్లు..
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు. -
Mamata Banerjee: అధ్యక్ష పాలన దిశగా దేశం.. “వన్ నేషన్-వన్ ఎలక్షన్”పై మమతా బెనర్జీ..
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది. -
Himanta Biswa Sarma: “గతంలో నెహ్రూ చేసిన విధంగానే”.. రామమందిర విషయంలో కాంగ్రెస్ ప్రవర్తన
Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. హిందువుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శిస్తోంది. తాజాగా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అని స్పష్టమైందని ఆయన గురువారం అన్నారు. మతాన్ని వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ, రామమందిరాన్ని బీజేపీ "రాజకీయ ప్రాజెక్ట్"గా పేర్కొంటూ, జనవరి 22న అయోధ్యలో జరగనున్న మహా… -
Suchana Seth: కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని 12 గంటల ప్రయాణం.. సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు..
Suchana Seth: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ కేసుల యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొడుకని చూడకుండా.. నాలుగేళ్ల పిల్లాడిని అత్యంత క్రూరంగా హతమార్చింది. కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళ్తుండగా.. గోవా పోలీసులు ఆమెను చిత్రదుర్గలో అరెస్ట్ చేశారు. నిందితురాలు జనవరి 6న గోవాలోని కాండోలిమ్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తన కొడుకు గొంతు నులిమి చంపింది. ఈ ఘటన తర్వాత ఆమె కూడా చనిపోయేందుకు ప్రయత్నించిందని కేసు విచారణ అధికారులు తెలిపారు. -
BJP: రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతల ఫోటోలతో బీజేపీ పోస్టర్లు..
BJP: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలక ఆహ్వానాన్ని ప్రతిపక్ష నేతలు తిరస్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైతే ఆహ్వానాలు తిరస్కరించారో వారిని టార్గెట్ చేస్తూ పోస్టర్ వార్కి దిగింది. ఆ పార్టీలు హిందూ వ్యతిరేకులని బీజేపీ ఆరోపించింది. ‘‘ రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించిన సనాతన ప్రత్యర్థుల ముఖాలను గమనించండి’’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. -
Ram Temple Event: “మోడీకి వ్యతిరేకం కాదు, కానీ”.. రామ మందిర వేడుకలకు హాజరుకాబోమన్న ఇద్దరు శంకరాచార్యులు..
Ram Temple Event: అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని గతంలో పూరీ శంకరాచార్య చెప్పారు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. రామాలయంపై రాజకీయం చేస్తున్నారని పూరీలోని గోవర్థన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయనతో జతకలిశారు ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.
తాజావార్తలు
-
Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
-
Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
-
Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!