Venu Goapl Reddy
Author- NTV Telugu-
Haveri Incident: మతాంతర జంటపై దాడి, యువతిపై అత్యాచారం.. జాతీయ మహిళ కమిషన్ సీరియస్..
Haveri Incident: కర్ణాటకలో మతాంతర జంట హోటల్ గదిలో ఉండగా.. ముస్లింమూక వారిపై దాడి చేసింది. ఏడుగురు నిందితులు వారిని తిడుతూ, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హవేరి ప్రాంతంతో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధిత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఆరోపణలతో పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. -
Cervical Cancer Vaccination: 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. ప్రారంభించనున్న కేంద్రం..
Cervical Cancer Vaccination: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. సర్వైకల్ క్యాన్సర్ని అడ్డుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. -
Porn Addiction: పిల్లల్లో పోర్న్ అడిక్షన్పై మద్రాస్ హైకోర్ట్ ఆందోళన.. కీలక వ్యాఖ్యలు..
Porn Addiction: ఈ తరం పిల్లల్లో పోర్న్ వ్యసనంపై మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలలో సులభంగా పోర్న్ ఫోటోలు, వీడియోలను చూసే అలవాటు ఈ తరం టీనేజర్లలో పెరుగున్నట్లు మద్రాస్ హైకోర్టు గుర్తించింది. టీనేజ్ యువతకు మార్గనిర్దేశం చేయాలని కోర్టు సమాజాన్ని కోరింది. -
Mukesh Ambani: ‘ముఖేష్ కాకా’ అంటూ పిలిచిన వ్యక్తి.. ముఖేష్ అంబానీ రియాక్షన్ వైరల్..
ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైబ్రంట్ గుజరాత్ ఈవెంట్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని పిలవడంతో ఆయన వెనక్కి తిరిగి చూసి ఓ చిరునవ్వు నవ్వుతూ, అతనికి అభివాదం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. బిలియనీర్ నుంచి వచ్చిన ఈ రియాక్షన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిపై కామెంట్స్ పెడుతున్నారు. -
Akash Missile: న్యూ జనరేషన్ “ఆకాష్ మిస్సైల్” ప్రయోగం సక్సెస్..
Akash Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుండి న్యూజనరేషన్ ఆకాష్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు. డీఆర్డీఓ అధికారులు ఈ పరీక్షను నిర్వహించారు. తక్కువ ఎత్తులో మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించేలా ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఆకాష్ ఆయుధ వ్యవస్థలోని అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంలో పనిచేశాయని అధికారులు వెల్లడించారు. -
Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో వెలుగులోకి పురాతన నగరం.. దీని విశేషాలు ఇవే..
Amazon Rainforest: ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవి, ప్రపంచానికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్న చెట్లతో నిండి ఉన్న అమెజాన్ వర్షారణ్య అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమికి అవసమయ్యే ఆక్సిజన్ ఎక్కువగా ఈ అడవుల్లో నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతపెద్దగా ఉంటుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. తాజాగా అమెజాన్ అడవిలో అత్యంత పురాతనమైన నగరాన్ని పరిశోధకులు కనుగొనడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. -
Ram Mandir inauguration: అయోధ్యలో 5 రెట్లు పెరిగిన హోటల్ రూం ధరలు.. 80 శాతం బుక్..
Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. -
Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర వేడులకు ప్రారంభయ్యాయి. అయోధ్య, యూపీలతో పాటు దేశవ్యాప్తంగా రామ భక్తులు జనవరి 22 ఆలయ ప్రారంభోత్సవ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. -
Congress: కాంగ్రెస్కి వ్యూహకర్తలు షాకిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్ తర్వాత సునీల్ కనుగోలు దూరం..?
Congress: 2024 సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీని గద్దె దించి కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారం చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ వంటి కీలక పార్టీలు ఇండియా కూటమి పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్కి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలుగా సునీల్ కనుగోలు 2024 లోక్సభ ఎన్నిలక ప్రచారంలో భాగం… -
Pak Terrorist: ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి
Pak Terrorist: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టవీ చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ధ్రువీకరించింది. భుట్టవి గత ఏడాది మేలో పంజాబ్ ప్రావిన్స్ లో ప్రభుత్వ కస్టడీలో ఉండగా.. గుండెపోటుతో మరణించాడు. ఇతను లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్కి డిప్యూటీగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
-
Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
-
Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!