Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగటున రూ. 10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని, ఇది 2013లో ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే సగటు రూ. 5.25 కోట్ల కన్నా 105 శాతం ఎక్కువ అని, 2008లో ఎన్నికైన ఎమ్మెల్యే సగటు రూ. 1.44 కోట్ల కన్నా 647 శాతం ఎక్కువ అని తెలిపింది.
నివేదిక ప్రకారం 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 107(83శాతం) మంది కోటీశ్వరులే కాగా.. 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 (78 శాతం) మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్య ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: AUS vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ ఓపెనర్లు.. సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2008 ఎన్నికల్లో ఎన్నికైన కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్య 84గా ఉంటే 2013లో 161కి చేరింది. ఇది 92 శాతం ఎక్కువ. ఇక 2018లో 15.5 శాతం పెరిగి 186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా తేలింది. 2013లో అధికార బీజేపీలో 118 మంది కోటీశ్వరులు ఉంటే.. 2018 ఎన్నికల్లో 9 శాతం తగ్గి 107కు చేరుకుంది. 2013లో 40గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 2018లో 142 శాతం పెరిగి 97కి చేరుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి చెందిన సంజయ్ పాఠక్ అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్కి 2013లో రూ. 141 కోట్ల ఆస్తులు ఉంటే, 2018లో 60 శాతం పెరిగి రూ. 226 కోట్లకు చేరింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ధనిక ఎమ్మెల్యేల జాబితాలో రూ.124 కోట్లతో ఆరోస్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు మాత్రం రూ. 7 కోట్లుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్ దంగోర్ కేవలం రూ. 50,000 ఆస్తులతో పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 97 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!