Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- గద్దెల అభివృద్ధితో మేడారానికి కొత్త రూపు
- రహదారులు, జంపన్న వాగు ఘాట్లపై ప్రత్యేక దృష్టి
- రవాణా–భద్రత కోసం భారీ ప్రణాళిక
- భక్తులకు ఇబ్బందుల్లేని జాతరే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో భాగంగా, మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి భరిణె రూపంలో సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువచ్చే ఘట్టం జాతరకే అత్యంత ప్రధానమైనది. మూడవ రోజు దేవతలు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వగా, నాల్గవ రోజు వన ప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి

2026 జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ జాతర కోసం ములుగు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను మంజూరు చేసి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ముఖ్యంగా మేడారం వైపు వచ్చే ప్రధాన రహదారుల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం , భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద స్నానపు ఘాట్ల ఏర్పాటు వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
భక్తుల రవాణా సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడపడమే కాకుండా, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. పారిశుధ్య లోపం తలెత్తకుండా వేలాది మంది సిబ్బందిని నియమించడంతో పాటు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు , భారీ పోలీసు బందోబస్తుతో జాతర ప్రాంగణాన్ని ఒక భద్రతా వలయంగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ బరువుకు తూగే బెల్లాన్ని (బంగారం) వనదేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ జాతరను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!