Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- గద్దెల అభివృద్ధితో మేడారానికి కొత్త రూపు
- రహదారులు, జంపన్న వాగు ఘాట్లపై ప్రత్యేక దృష్టి
- రవాణా–భద్రత కోసం భారీ ప్రణాళిక
- భక్తులకు ఇబ్బందుల్లేని జాతరే లక్ష్యం
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో భాగంగా, మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి భరిణె రూపంలో సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువచ్చే ఘట్టం జాతరకే అత్యంత ప్రధానమైనది. మూడవ రోజు దేవతలు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వగా, నాల్గవ రోజు వన ప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
Also Read

2026 జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ జాతర కోసం ములుగు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను మంజూరు చేసి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ముఖ్యంగా మేడారం వైపు వచ్చే ప్రధాన రహదారుల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం , భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద స్నానపు ఘాట్ల ఏర్పాటు వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
భక్తుల రవాణా సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడపడమే కాకుండా, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. పారిశుధ్య లోపం తలెత్తకుండా వేలాది మంది సిబ్బందిని నియమించడంతో పాటు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు , భారీ పోలీసు బందోబస్తుతో జాతర ప్రాంగణాన్ని ఒక భద్రతా వలయంగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ బరువుకు తూగే బెల్లాన్ని (బంగారం) వనదేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ జాతరను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!