Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- గద్దెల అభివృద్ధితో మేడారానికి కొత్త రూపు
- రహదారులు, జంపన్న వాగు ఘాట్లపై ప్రత్యేక దృష్టి
- రవాణా–భద్రత కోసం భారీ ప్రణాళిక
- భక్తులకు ఇబ్బందుల్లేని జాతరే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో భాగంగా, మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి భరిణె రూపంలో సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువచ్చే ఘట్టం జాతరకే అత్యంత ప్రధానమైనది. మూడవ రోజు దేవతలు ఇద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వగా, నాల్గవ రోజు వన ప్రవేశంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..

2026 జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ జాతర కోసం ములుగు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను మంజూరు చేసి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ముఖ్యంగా మేడారం వైపు వచ్చే ప్రధాన రహదారుల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం , భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద స్నానపు ఘాట్ల ఏర్పాటు వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
భక్తుల రవాణా సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడపడమే కాకుండా, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. పారిశుధ్య లోపం తలెత్తకుండా వేలాది మంది సిబ్బందిని నియమించడంతో పాటు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు , భారీ పోలీసు బందోబస్తుతో జాతర ప్రాంగణాన్ని ఒక భద్రతా వలయంగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ బరువుకు తూగే బెల్లాన్ని (బంగారం) వనదేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ జాతరను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!