దేశంలో మళ్లీ ఖలిస్తానీ ఉగ్రవాదం మొదలవుతుందా… ? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఈ అనుమానం రాక మానదు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన తీరును గమనిస్తే మరోసారి సిక్కు వేర్పాటువాద ఖలిస్తానీ ఉగ్రవాదులు యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సిక్ ఫర్ జస్టిస్ (ఎసఎఫ్ జే) సంస్థ విదేశాల నుంచి భారత్ లో తన కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఇటీవల పంజాబ్ మోహాలీలో ఇంటిజెన్స్ హెడ్ క్వార్టర్ పై రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రానెడ్( […]
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ […]
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని […]
దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి […]
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిత్ సుఖ్ రామ్(95) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సుక్ రామ్ న్యూఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ శర్మ తెలియజేశారు. మే 4న బ్రెయన్ స్ట్రోక్ కు గురయిన మాజీ కేంద్రమంత్రి ఆరోగ్య క్షీణిస్తూ వచ్చింది. గత శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ హస్పిటల్ లో చేర్చారు కుటుంబ సభ్యులు. చికిత్స […]
అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు , సీ పోర్టులు వేదికలు అవతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయాల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడుతున్నాయి. విదేశాల నుంచి దేశానికి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సముద్రమార్గాల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తీసుకువస్తున్నారు. తాజా దేశంలో బంగారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడగా… తమిళనాడు కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీ […]
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 […]
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా […]
‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని […]