Loud Speakers row: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. లౌడ్ స్పీకర్లపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ బస్వరాజ్ బొమ్మై సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తప్ప లౌడ్ స్పీకర్లు వినియోగించరానది ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటోరియం, కాన్ఫరెన్స్ రూమ్ లు, కమ్యూనిటీ హాల్స్ తో పాటు మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్పితే ఇతర బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో శబ్ధ తీవ్రత 10 డెసిబల్స్ కు మించరాదనే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఇటీవల కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యాలయాలకు హిజాబ్ ధరించి రావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్ట్ కూడా సమర్థించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుతం లౌడ్ స్పీకర్ల వివాదం కర్ణాటకలో లౌడ్ స్పీకర్ వివాదం నడుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా లౌడ్ స్పీకర్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం నడుస్తోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ మధ్య లౌడ్ స్పీకర వివాదం ముదురుతోంది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రార్థనలు వినిపిస్తే దీనికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు రాజ్ ఠాక్రే. మరోవైపు ఈ వివాదంలోకి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కూడా చేరారు. ఇటీవల సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి అరెస్ట్ అయ్యారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!