Subramanian Swamy: శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సే, రాజపక్సే కుటుంబీకుల కారణంగానే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రస్తుతం శ్రీలంక దేశంలో నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజపక్సే పూర్వీకుల ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. రాజీనామా చేసిన ప్రధాని మహీందా రాజపక్సేను భద్రత కారణాలతో సురక్షిత ప్రదేశానికి తరలించింది. ఇదిలా ఉంటే అక్కడి పోలీసులకు, ఆర్మీకి ప్రభుత్వం విశేషాధికారాలను కట్టబెట్టింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కనిపిస్తే కాల్చివేయాలనే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనల వల్ల ఆరుగులు మరణించారు…11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలని సూచించారు. శ్రీలంకలో రాజ్యాంగబద్ధ పాలనను తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీని పంపాలని… కొన్ని విదేశీ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నాయి… ఇది భారతదేశ భద్రతను ప్రభావితం చేస్తుందంటూ…ట్వీట్ చేశారు. గతంలో 1987లో శ్రీలంక అధ్యక్షుడిగా జయవర్థనే ఉన్నప్పుడు శ్రీలంక ఉత్తర ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ఇండియా ఆర్మీని పంపిందని… ఎన్నికలు కూడా నిర్వహించిందని.. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రేమదాస ఎల్టీటీఈకి ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించి భారత్ ను మోసం చేశాడని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!