Subramanian Swamy: శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సే, రాజపక్సే కుటుంబీకుల కారణంగానే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రస్తుతం శ్రీలంక దేశంలో నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజపక్సే పూర్వీకుల ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. రాజీనామా చేసిన ప్రధాని మహీందా రాజపక్సేను భద్రత కారణాలతో సురక్షిత ప్రదేశానికి తరలించింది. ఇదిలా ఉంటే అక్కడి పోలీసులకు, ఆర్మీకి ప్రభుత్వం విశేషాధికారాలను కట్టబెట్టింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కనిపిస్తే కాల్చివేయాలనే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనల వల్ల ఆరుగులు మరణించారు…11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకకు ఇండియన్ ఆర్మీని పంపాలని సూచించారు. శ్రీలంకలో రాజ్యాంగబద్ధ పాలనను తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీని పంపాలని… కొన్ని విదేశీ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నాయి… ఇది భారతదేశ భద్రతను ప్రభావితం చేస్తుందంటూ…ట్వీట్ చేశారు. గతంలో 1987లో శ్రీలంక అధ్యక్షుడిగా జయవర్థనే ఉన్నప్పుడు శ్రీలంక ఉత్తర ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ఇండియా ఆర్మీని పంపిందని… ఎన్నికలు కూడా నిర్వహించిందని.. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రేమదాస ఎల్టీటీఈకి ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించి భారత్ ను మోసం చేశాడని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!