Narendra Modi: పోఖ్రాన్ అణు పరీక్షపై మోదీ ట్వీట్… అటల్ జీ ధైర్యం చూపారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు.
1998 అటల్ బీహారీ వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ‘ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో 1998 మే 11-13 మధ్య అణు పరీక్షలు నిర్వహించారు. పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తడి ఉన్నప్పటికీ… ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియా అణు పరీక్షలు చేయవద్దనే ఒత్తడి ఉండేది. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి వాజ్ పేయ్ అణు పరీక్షలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యంత రహస్యంగా ఈ అణు పరీక్షలు నిర్వహించారు.
Also Read
ఎప్పుడూ ఆకాశం నుంచి శాటిలైట్ల ద్వారా నిఘా ఉంచే అమెరికానే బోల్తా కొట్టించింది ఇండియా. కనీసం అణు పరీక్షలు నిర్వహిస్తున్నారని అమెరికా సీఐఏకు అనుమానం రాకుండా అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిగిన తర్వాత కానీ అమెరికాకు ఈ విషయం తెలియదంటే… ఎంత రహస్యంగా ఈ పరీక్షలు జరిగాయో తెలుస్తోంది. అంతకు ముందు 1995లో పరీక్షలు నిర్వహించే సమయంలో సీఐఏ పసిగట్టడంతో సీక్రేట్ గా స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ చేశారు. రాజస్థాన్ లోని థార్ ఎడారి పోఖ్రాన్ ప్రాంతంలో ఈ అణుపరీక్షలు జరిగాయి. ప్రధాని వాజ్ పేయ్ తో పాటు అప్పటి డీఆర్డీఓ చీఫ్ గా ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ( డీఏఈ) డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిదంబరం కీలకంగా వ్యవహరించారు.
Today, on National Technology Day, we express gratitude to our brilliant scientists and their efforts that led to the successful Pokhran tests in 1998. We remember with pride the exemplary leadership of Atal Ji who showed outstanding political courage and statesmanship. pic.twitter.com/QZXcNvm6Pe
— Narendra Modi (@narendramodi) May 11, 2022
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!