Narendra Modi: పోఖ్రాన్ అణు పరీక్షపై మోదీ ట్వీట్… అటల్ జీ ధైర్యం చూపారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు.
1998 అటల్ బీహారీ వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ‘ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో 1998 మే 11-13 మధ్య అణు పరీక్షలు నిర్వహించారు. పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తడి ఉన్నప్పటికీ… ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియా అణు పరీక్షలు చేయవద్దనే ఒత్తడి ఉండేది. అయితే వీటన్నింటిని పక్కన పెట్టి వాజ్ పేయ్ అణు పరీక్షలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యంత రహస్యంగా ఈ అణు పరీక్షలు నిర్వహించారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
ఎప్పుడూ ఆకాశం నుంచి శాటిలైట్ల ద్వారా నిఘా ఉంచే అమెరికానే బోల్తా కొట్టించింది ఇండియా. కనీసం అణు పరీక్షలు నిర్వహిస్తున్నారని అమెరికా సీఐఏకు అనుమానం రాకుండా అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిగిన తర్వాత కానీ అమెరికాకు ఈ విషయం తెలియదంటే… ఎంత రహస్యంగా ఈ పరీక్షలు జరిగాయో తెలుస్తోంది. అంతకు ముందు 1995లో పరీక్షలు నిర్వహించే సమయంలో సీఐఏ పసిగట్టడంతో సీక్రేట్ గా స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ చేశారు. రాజస్థాన్ లోని థార్ ఎడారి పోఖ్రాన్ ప్రాంతంలో ఈ అణుపరీక్షలు జరిగాయి. ప్రధాని వాజ్ పేయ్ తో పాటు అప్పటి డీఆర్డీఓ చీఫ్ గా ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ( డీఏఈ) డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిదంబరం కీలకంగా వ్యవహరించారు.
Today, on National Technology Day, we express gratitude to our brilliant scientists and their efforts that led to the successful Pokhran tests in 1998. We remember with pride the exemplary leadership of Atal Ji who showed outstanding political courage and statesmanship. pic.twitter.com/QZXcNvm6Pe
— Narendra Modi (@narendramodi) May 11, 2022
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?