Sri Lanka Crisis: రావణకాష్టంలా శ్రీలంక… ఆందోళనల్లో ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా రాజపక్సేను ఆర్మీ అధికారులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఓ నావెల్ బేస్ లో రక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తక్షణమే శ్రీలంక పార్లమెంట్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్, అధ్యక్షుడు గొటబయ రాజపక్సేను కోరారు.
నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ ఆర్మీ, పోలీసులకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు ఆందోళనకారులను అదుపు చేసేందుకు పది మంది కరుడుగట్టిన ఖైదీలను రాజపక్సే సర్కార్ విడుదల చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జనం రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పోలీసులు, ఆర్మీ టియర్ గ్యాస్ వినియోగించినా… ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. దేశంలో జరుగున్న హింసాత్మక ఘటనలను చూసి బౌద్ధగురువులు భరించలేకపోతున్నారు. ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఓ బౌద్ధ గురువు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం అందర్ని కలిచివేసింది.
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరగడంతో పాటు గ్యాస్, పెట్రోల్ లభించని పరిస్థితులు ఏర్పడటంతో జనాల్లో అసహనం ఏర్పడింది. శ్రీలంక పరిస్థితికి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహీందా రాజపక్సేల అవినీతే కారణం అంటూ ప్రజలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
తాజావార్తలు
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!