Sri Lanka Crisis: రావణకాష్టంలా శ్రీలంక… ఆందోళనల్లో ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా రాజపక్సేను ఆర్మీ అధికారులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఓ నావెల్ బేస్ లో రక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తక్షణమే శ్రీలంక పార్లమెంట్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్, అధ్యక్షుడు గొటబయ రాజపక్సేను కోరారు.
నిన్నటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ ఆర్మీ, పోలీసులకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు ఆందోళనకారులను అదుపు చేసేందుకు పది మంది కరుడుగట్టిన ఖైదీలను రాజపక్సే సర్కార్ విడుదల చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జనం రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పోలీసులు, ఆర్మీ టియర్ గ్యాస్ వినియోగించినా… ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. దేశంలో జరుగున్న హింసాత్మక ఘటనలను చూసి బౌద్ధగురువులు భరించలేకపోతున్నారు. ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఓ బౌద్ధ గురువు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం అందర్ని కలిచివేసింది.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరగడంతో పాటు గ్యాస్, పెట్రోల్ లభించని పరిస్థితులు ఏర్పడటంతో జనాల్లో అసహనం ఏర్పడింది. శ్రీలంక పరిస్థితికి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహీందా రాజపక్సేల అవినీతే కారణం అంటూ ప్రజలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!