Sikh For Justice (SFJ): పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఘటనలతో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు ప్రమేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మళ్లీ ఖలిస్తానీ ఉగ్రవాదం మొదలవుతుందా… ? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఈ అనుమానం రాక మానదు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన తీరును గమనిస్తే మరోసారి సిక్కు వేర్పాటువాద ఖలిస్తానీ ఉగ్రవాదులు యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సిక్ ఫర్ జస్టిస్ (ఎసఎఫ్ జే) సంస్థ విదేశాల నుంచి భారత్ లో తన కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా ఇటీవల పంజాబ్ మోహాలీలో ఇంటిజెన్స్ హెడ్ క్వార్టర్ పై రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రానెడ్( ఆర్పీజీ)తో దాడి చేశారు. ఈదాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీని తర్వాత హిమచల్ ప్రదేశ్ విధాన సభ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరవేయడంతో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కు వార్నింగ్ ఇవ్వడంపై సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ బాధ్యత వహించాడు. ఈ రెండు ఘటనలకు తామే కారణం అంటూ ఓ ఆడియో మెసేజ్ ను పంపించాడు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మోహాలీ ఆర్పీజీ గ్రానెడ్ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోండి… లేకపోతే సిమ్లాలో కూడా ఇలాంటి ఘటనే జరుగుతుందని.. సిక్కులను రెచ్చగొట్టవద్దని హిమాచల్ ప్రదేశ్ సీఎంకు గురుపత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో రైతు ఉద్యమంలో కూడా ఖలిస్తానీ వేర్పాటవాద గ్రూప్ ఆనవాళ్లు కనిపించాయి. పంజాబ్ ఎన్నికల ముందు ప్రధాని కాన్వాయ్ ను రైతులు ఆపేయడం, సెక్యురిటీ వైఫల్యం సమయంలో కూడా తమ పాత్ర ఉన్నట్లు సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ పన్నూ ప్రకటించారు.
కాగా తనకు వచ్చిన బెదిరింపులపై సీఎం జైరామ్ ఠాకూర్ స్పందించారు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అన్నారు… అయితే ఈ ఘటనలను పెద్దగా పట్టించుకోనని.. గురుపత్వంత్ సింగ్ పన్నూను సీరియస్ గా తీసుకోనని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ విధాన సభ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరవేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!