Venu Goapl Reddy
Author- NTV Telugu-
Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్విఎస్ డియో అన్నారు. -
Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..
Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. -
Wolf 1069 b: భూమికి అత్యంత సమీపంలో భూమిలాంటి గ్రహం..
Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. -
Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్రమోదీ..
Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో 78 శాతం ఆమోదంతో నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ చోటు సంపాదించారు. వీరంతా మోదీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..
Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్లోని బార్మర్లో గురువారం జరిగిన మతపరమైన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదని.. ప్రపంచాన్ని ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మార్చాలని వారు నిమగ్నం అయి… -
MLC Elections: యూపీలో తిరుగులేని బీజేపీ.. మహారాష్ట్రలో కాషాయానికి ఎదురుదెబ్బ
UP, Maharashtra Legislative Council Election Results: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ హావా కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా శాసనమండలి జరిగిన ఎన్నికల్లో కీలక విజయం సొంతం చేసుకుంది బీజేపీ. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని గెలుచుకుంది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కించుకోవాలనే ఆశలను బీజేపీ దెబ్బకొట్టింది. -
EzriCare Eye Drops: ఇండియన్ కంపెనీకి చెందిన ఐడ్రాప్స్తో అమెరికాలో ఒకరి మరణం.. రీకాల్ చేసిన కంపెనీ
Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు. -
Jammu Kashmir: జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
Pakistan: పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు
Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్ తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. -
Covid-19: కోవిడ్ తర్వాత తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్న హెల్త్ వర్కర్స్.. అధ్యయనంలో వెల్లడి..
Covid-19: మూడేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా రకరకాల వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూనే ఉన్నాయి. కోరోనా వైరస్ పలు దేశాల వ్యాపారం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తడిని కలిగించింది. ముఖ్యంగా కరోనా వేవ్ లు ముంచుకొచ్చిన సమయంలో వైద్యరంగం తీవ్ర ఇబ్బందులకు గురైంది. వైద్యులు, హెల్త్ వర్కర్లు తీవ్ర ఒత్తడిని ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?