Ram Setu: రామసేతు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SC will hear plea to declare ‘Ram Setu’ national heritage monument: ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ.. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును లిస్టింగ్ చేయాలని స్వామి కోరగా… దాన్ని జస్టిస్ చంద్రచూడ్ దర్మాసనం ముందు ప్రస్తావించాలని సూచించారు. దీంతో సుబ్రమణ్య స్వామి ఈ విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించగా.. బెంచ్ లోని ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరుపుతామని.. ఈ అంశాన్ని విచారణ జాబితాలో చేరుస్తామని చెప్పారు. దీంతో ఈ కేసును చంద్రచూడ్ ధర్మాసనం విచారించబోతోంది. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని.. అత్యవసర విచారణ అవసరం అని సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టుకు విన్నవించారు.
రామసేతును జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా ప్రకటించాలని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ)తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తిస్థాయి సర్వే జరిగేలా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
Read Also: RRR – Shyam Singha Roy: ట్రిపుల్ఆర్, శ్యామ్ సింగరాయ్కి ఆస్కార్ ఆస్కారం ఉందా?
రామసేతు ఉనికిని కేంద్రం అంగీకరించిందని.. సేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలనే తమ డిమాండ్ తో 2017లో అప్పటి కేంద్రమంత్రి సమావేశానికి పిలిచారని.. ఆ తరువాత ఏం జరగలేదని స్వామి వెల్లడించారు. రామసేతు తమిళనాడు ఆగ్నేయ తీరాన్ని అనుకుని ఉన్న ఉన్న ఓ వంతెన లాంటి నిర్మాణం. రామాయణ కాలంలో రాముడు ఇక్కడ నుంచే శ్రీలంకకు వారధి నిర్మించారని చాలా మంది నమ్ముతుంటారు.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!