China: చైనాలో కరెంట్ కు కటకట.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soutwest China Face Power Cuts Amid Heatwave: చైనా తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడుతోంది. ముఖ్యంగా నైరుతి చైనా ప్రాంతంలో కరెంట్ కోతలు పెరిగాయి. ఇటీవల కాలంలో చైనాలోని నైరుతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన హీట్ వేవ్ విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సిచువాన్ ప్రావిన్స్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి నమోదు అవుతున్నాయి. దీని వల్ల ఏసీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కరెంట్ కోతలు తప్పడం లేదు. ఇదే కాకుండా సిచువాన్ ప్రావిన్స్ లో కరెంట్ ఎక్కువగా జలవిద్యుత్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఎండల ధాటికి నీరు కూడా అడుగంటుకుపోవడంతో కరెంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
చైనా నైరుతి ప్రాంతంలో దాదాపుగా 50 లక్షల మంది కరెంట్ కోతలతో అల్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డాజౌ నగరానికి అడపాదడపా మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ సంక్షోభం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. జపనీస్ కంపెనీ టయోటా, సిచువాన్ లోని తన వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. చెంగ్డులోని టయోటా ప్లాంట్ లో పనులను నిలిపివేసింది. ఇదే కాకుండా అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కూడా ఇబిన్ నగరంలోని తన ప్లాంట్ లో ఉత్పత్తిని నిలిపివేసింది. సిచువాన్ ప్రావిన్స్ లో 21 నగరాల్లో 19 నగరాల్లో పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపి వేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
Read Also: Rahul Gandhi: బిల్కిస్ బానో కేసుతో మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు…?
చైనాలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాదిలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత నెలలో యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. యూకే, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో 40 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో యూకే ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ విధించారు. లండన్ తో పాటు యూకేలోని వివిధ ప్రాంతాలకు నీరందించే థేమ్స్ నది కూడా ఎండిపోయే స్థితికి వచ్చింది. యూరప్ లోని పలు దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!