China: చైనాలో కరెంట్ కు కటకట.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soutwest China Face Power Cuts Amid Heatwave: చైనా తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడుతోంది. ముఖ్యంగా నైరుతి చైనా ప్రాంతంలో కరెంట్ కోతలు పెరిగాయి. ఇటీవల కాలంలో చైనాలోని నైరుతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన హీట్ వేవ్ విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సిచువాన్ ప్రావిన్స్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి నమోదు అవుతున్నాయి. దీని వల్ల ఏసీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కరెంట్ కోతలు తప్పడం లేదు. ఇదే కాకుండా సిచువాన్ ప్రావిన్స్ లో కరెంట్ ఎక్కువగా జలవిద్యుత్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఎండల ధాటికి నీరు కూడా అడుగంటుకుపోవడంతో కరెంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
చైనా నైరుతి ప్రాంతంలో దాదాపుగా 50 లక్షల మంది కరెంట్ కోతలతో అల్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డాజౌ నగరానికి అడపాదడపా మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ సంక్షోభం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. జపనీస్ కంపెనీ టయోటా, సిచువాన్ లోని తన వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. చెంగ్డులోని టయోటా ప్లాంట్ లో పనులను నిలిపివేసింది. ఇదే కాకుండా అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కూడా ఇబిన్ నగరంలోని తన ప్లాంట్ లో ఉత్పత్తిని నిలిపివేసింది. సిచువాన్ ప్రావిన్స్ లో 21 నగరాల్లో 19 నగరాల్లో పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపి వేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
Read Also: Rahul Gandhi: బిల్కిస్ బానో కేసుతో మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు…?
చైనాలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాదిలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత నెలలో యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. యూకే, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో 40 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో యూకే ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ విధించారు. లండన్ తో పాటు యూకేలోని వివిధ ప్రాంతాలకు నీరందించే థేమ్స్ నది కూడా ఎండిపోయే స్థితికి వచ్చింది. యూరప్ లోని పలు దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!