Maharashtra: రాయ్గడ్ టెర్రర్ బోట్ కలకలం.. ముంబై తరహా దాడులు చేసేందుకు కుట్ర..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Raigad terror boat stir: మహారాష్ట్ర రాయ్గడ్ లో అరేబియా తీరంలో రెండు పడవలు కలకలం సృష్టించాయి. పడవల్లో మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరేబియా తీరం హరహరేశ్వర్ తీరంలో ఈ రెండు పడవులను గుర్తించారు. బోట్ లో ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, మరికొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రాయ్గడ్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు పోలీసులు. పట్టుబడిన బోట్లు స్పీడ్ బోట్లు.. ఇవి యూకేలో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక ఉగ్రవాద కోణం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహరాష్ట్ర పోలీసులతో పాటు ఏటీఎస్( యాంటీ టెర్రర్ స్వ్కాడ్) ఘటన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ముంబై తరహా దాడికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్
గణేష్ ఉత్సవాలు దగ్గరకు వస్తున్న క్రమంలో ఈ పడవలు వెలుగులోకి రావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రత్యేక విచారణ జరపాలని.. రాయ్గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే కోరారు. శుక్రవారం దహీ హండీ, కృష్ణాష్టమి పండగలు ఉండటంతో పాటు మరో 10 రోజుల్లో వినాయక చవితి, గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న క్రమంలోొ ఇలా అరేబియా తీరంలో మారణాయుధాలతో బోట్లు దొరకడంతో ఒక్కసారిగా మహా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ రెండు బోట్లు దొరికిన ప్రాంతం ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయ్ గడ్ ఎస్పీ అశోక్ దూధే, ఇతర పోలీస్ అధికారులు రెండు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చుట్టుపక్కట జిల్లాలను మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు.
2008, నవంబర్ 26న ఇలాగే పాకిస్తాన్ నుంచి ముంబై తీరానికి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఏకంగా మూడు రోజుల పాటు ముంబై మహానగరాన్ని వణికించారు. నారిమన్ హౌజ్, తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ పై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 175 మంది సాధారణ ప్రజలు, పోలీసులు చనిపోయారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!