Maharashtra: రాయ్గడ్ టెర్రర్ బోట్ కలకలం.. ముంబై తరహా దాడులు చేసేందుకు కుట్ర..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Raigad terror boat stir: మహారాష్ట్ర రాయ్గడ్ లో అరేబియా తీరంలో రెండు పడవలు కలకలం సృష్టించాయి. పడవల్లో మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరేబియా తీరం హరహరేశ్వర్ తీరంలో ఈ రెండు పడవులను గుర్తించారు. బోట్ లో ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, మరికొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రాయ్గడ్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు పోలీసులు. పట్టుబడిన బోట్లు స్పీడ్ బోట్లు.. ఇవి యూకేలో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక ఉగ్రవాద కోణం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహరాష్ట్ర పోలీసులతో పాటు ఏటీఎస్( యాంటీ టెర్రర్ స్వ్కాడ్) ఘటన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ముంబై తరహా దాడికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్
గణేష్ ఉత్సవాలు దగ్గరకు వస్తున్న క్రమంలో ఈ పడవలు వెలుగులోకి రావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రత్యేక విచారణ జరపాలని.. రాయ్గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే కోరారు. శుక్రవారం దహీ హండీ, కృష్ణాష్టమి పండగలు ఉండటంతో పాటు మరో 10 రోజుల్లో వినాయక చవితి, గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న క్రమంలోొ ఇలా అరేబియా తీరంలో మారణాయుధాలతో బోట్లు దొరకడంతో ఒక్కసారిగా మహా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ రెండు బోట్లు దొరికిన ప్రాంతం ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయ్ గడ్ ఎస్పీ అశోక్ దూధే, ఇతర పోలీస్ అధికారులు రెండు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చుట్టుపక్కట జిల్లాలను మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు.
2008, నవంబర్ 26న ఇలాగే పాకిస్తాన్ నుంచి ముంబై తీరానికి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఏకంగా మూడు రోజుల పాటు ముంబై మహానగరాన్ని వణికించారు. నారిమన్ హౌజ్, తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ పై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 175 మంది సాధారణ ప్రజలు, పోలీసులు చనిపోయారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!