First Electric Double-Decker Bus: ఇండియాలో తొలి ఈవీ డబుల్ డెక్కర్ బస్.. ఆవిష్కరించిన గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari unveils India’s first electric AC double-decker bus in Mumbai:భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఈవీ విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. భవిష్యత్తు రవాణా రంగంలో ఈవీని ప్రోత్సహించేలా కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెట్రోల్, డిజిల్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, కార్ల కొనుగోలు గతంలో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ లారీలు, బస్సులను మరింతగా తీసుకురావడానికి కృషి జరుగుతోంది.
Read Also: RRR : ఆస్కార్ బరిలో ‘ట్రిపుల్ ఆర్’ నిలచి, గెలిచేనా!?
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
తాజాా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ముంబైలో భారత మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పుల్లీ ఎయిర్ కండిషన్డ్ బస్సును ఆవిష్కరించారు. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) కొత్తగా కొనుగోలు చేసిన ఈవీ డబుల్ డెక్కర్ బస్సును గడ్కరీ ఆవిష్కరించారు. దశల వారీగా మరికొన్ని బస్సులు 2023 నాటికి ముంబై మహానగరం రోడ్లపైకి రానున్నాయి. ‘‘సుస్థిరమైన విప్లవానికి నాంది.. ఈ రోజు ముంబైలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని’’ ట్విట్టర్ లో నితిన్ గడ్కరీ రాసుకొచ్చారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతం ఇస్తుందని.. తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన పరిష్కారాలను చూపిస్తుందని ఆయన అన్నారు. చమురు దిగుమతులను తగ్గించడం.. స్వదేశీ వనరులకు, సేవలకు ప్రోత్సహించడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్, ప్రధాని నరేంద్ మోదీ కలను సాకారం చేస్తుందని ట్విట్టర్ లో అభిప్రాయపడ్డారు.
గతంలో గడ్కరీ పార్లమెంట్ సమావేశాలకు హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లో పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. రాబోయే కాలంలో పెట్రోల్, డిజిల్ దిగుమతులను తగ్గించడంతో పాటు విదేశీమారక నిల్వలను కాపాడుకునేందుకు భారత్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు దేశం ఏటా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి ఎలక్ట్రిక్ వాహనాలే పరిష్కారం అని కేంద్రం భావిస్తోంది.
తాజావార్తలు
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!