Mehbooba Mufti: బీజేపీ కాశ్మీర్ ని ప్రయోగశాల చేసింది.. ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు దేశాన్ని హిందూ దేశంగా కాకుండా.. బీజేపీ దేశంగా మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.
జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఓటు హక్కుతో పాటు 25 లక్షల మంది తాజాగా కొత్త ఓటర్లను చేర్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీరీ పండిట్ అయినా.. స్థానికేతరుడైనా, ఉగ్రవాది అయినా, ఇండియన్ ఆర్మీ అయినా జమ్మూ కాశ్మీర్ లో చిందే ప్రతీ రక్తపు బొట్టుతో బీజేపీ ప్రయోజనం పొందుతోందని ఆమె విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతీ హత్యను బీజేపీ సొమ్ము చేసుకుంటోందని.. జమ్మూ కాశ్మీర్ శాంతిని కోరుకోవడం లేదని అన్నారు.
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
Read Also: Addanki Dayakar: బీజేపీ కుట్రలో శశిధర్ రెడ్డి పావులౌతున్నారు
బీజేపీ ఎన్నికల రిగ్గింగుకు పాల్పడుతోందని ఆమె మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. రిగ్గింగ్ అనేది బీజేపీలో భాగం అయిపోయిందని ఆరోపించారు. అధికారం కోసం డబ్బును, అధికారాన్ని వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేయడం ద్వారా దేశం మొత్తంలో అధికారాన్ని పొందాలనేదే బీజేపీ ఉద్ధేశం అని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చారని.. బీజేపీ జాతి ప్రయోజనాల కోసం ఏం చేయడం లేదని ఆమె ఆరోపించారు. త్వరలో జాతీయ పతాకాన్ని కూడా కాషాయరంగులోకి మారుస్తారని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నాజీ జర్మన్ విధానాన్ని అమలు చేస్తోందని.. పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేసిన విధంగానే స్థానికులను నిర్వీర్యం చేస్తుందని బీజేపీని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!