Mehbooba Mufti: బీజేపీ కాశ్మీర్ ని ప్రయోగశాల చేసింది.. ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు దేశాన్ని హిందూ దేశంగా కాకుండా.. బీజేపీ దేశంగా మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.
జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఓటు హక్కుతో పాటు 25 లక్షల మంది తాజాగా కొత్త ఓటర్లను చేర్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీరీ పండిట్ అయినా.. స్థానికేతరుడైనా, ఉగ్రవాది అయినా, ఇండియన్ ఆర్మీ అయినా జమ్మూ కాశ్మీర్ లో చిందే ప్రతీ రక్తపు బొట్టుతో బీజేపీ ప్రయోజనం పొందుతోందని ఆమె విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతీ హత్యను బీజేపీ సొమ్ము చేసుకుంటోందని.. జమ్మూ కాశ్మీర్ శాంతిని కోరుకోవడం లేదని అన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Addanki Dayakar: బీజేపీ కుట్రలో శశిధర్ రెడ్డి పావులౌతున్నారు
బీజేపీ ఎన్నికల రిగ్గింగుకు పాల్పడుతోందని ఆమె మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. రిగ్గింగ్ అనేది బీజేపీలో భాగం అయిపోయిందని ఆరోపించారు. అధికారం కోసం డబ్బును, అధికారాన్ని వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేయడం ద్వారా దేశం మొత్తంలో అధికారాన్ని పొందాలనేదే బీజేపీ ఉద్ధేశం అని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చారని.. బీజేపీ జాతి ప్రయోజనాల కోసం ఏం చేయడం లేదని ఆమె ఆరోపించారు. త్వరలో జాతీయ పతాకాన్ని కూడా కాషాయరంగులోకి మారుస్తారని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నాజీ జర్మన్ విధానాన్ని అమలు చేస్తోందని.. పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేసిన విధంగానే స్థానికులను నిర్వీర్యం చేస్తుందని బీజేపీని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!