Mehbooba Mufti: బీజేపీ కాశ్మీర్ ని ప్రయోగశాల చేసింది.. ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు దేశాన్ని హిందూ దేశంగా కాకుండా.. బీజేపీ దేశంగా మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.
జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఓటు హక్కుతో పాటు 25 లక్షల మంది తాజాగా కొత్త ఓటర్లను చేర్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీరీ పండిట్ అయినా.. స్థానికేతరుడైనా, ఉగ్రవాది అయినా, ఇండియన్ ఆర్మీ అయినా జమ్మూ కాశ్మీర్ లో చిందే ప్రతీ రక్తపు బొట్టుతో బీజేపీ ప్రయోజనం పొందుతోందని ఆమె విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతీ హత్యను బీజేపీ సొమ్ము చేసుకుంటోందని.. జమ్మూ కాశ్మీర్ శాంతిని కోరుకోవడం లేదని అన్నారు.
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Read Also: Addanki Dayakar: బీజేపీ కుట్రలో శశిధర్ రెడ్డి పావులౌతున్నారు
బీజేపీ ఎన్నికల రిగ్గింగుకు పాల్పడుతోందని ఆమె మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. రిగ్గింగ్ అనేది బీజేపీలో భాగం అయిపోయిందని ఆరోపించారు. అధికారం కోసం డబ్బును, అధికారాన్ని వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేయడం ద్వారా దేశం మొత్తంలో అధికారాన్ని పొందాలనేదే బీజేపీ ఉద్ధేశం అని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చారని.. బీజేపీ జాతి ప్రయోజనాల కోసం ఏం చేయడం లేదని ఆమె ఆరోపించారు. త్వరలో జాతీయ పతాకాన్ని కూడా కాషాయరంగులోకి మారుస్తారని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నాజీ జర్మన్ విధానాన్ని అమలు చేస్తోందని.. పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేసిన విధంగానే స్థానికులను నిర్వీర్యం చేస్తుందని బీజేపీని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!