Venu Goapl Reddy
Author- NTV Telugu-
USA: అమెరికా మారదు.. పాకిస్తాన్తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన
US Looks Forward To Continue Working With Pakistan: అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది. -
Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఘాతుకం.. రూ.1.9 కోట్ల కోసం భార్య హత్య..
Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న… -
ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..
Terror Group ISIS Says Its Leader Abu Hasan Al-Qurashi Killed: ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కీలక నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐసిస్ ప్రతినిధి వెల్లడించారు. ‘దేవుడి శత్రువులతో జరిగిన యుద్ధం’లో చంపబడ్డాడని బుధవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఆడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ఐసిస్ ప్రకటించింది. ఈ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తిని కొత్త నాయకుడు అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేనీ అల్-ఖురాషీగా… -
Python Attack: మనిషిపై కొండచిలువ దాడి.. గంటపాటు పోరాటం.. చివరకు ఏమైందంటే..?
Python attack on a Man.. Incident in Tamil Nadu: తమిళనాడులో ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. ఎవరూ చూడకపోయుంటే ప్రాణాలు పోయేవే. అయితే లక్కీగా దాడి జరిగిన సమయంలో మిగతా ప్రజలు ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏకంగా గంటపాటు కొండచిలువతో పోరాటం కొనసాగింది. వ్యక్తి కాలుకు చుట్టుకున్న కొండచిలువను వదిలించేందుకు గంట పాటు రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది అధికారులు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ “ఎన్నికల హిందువు”.. బీజేపీ విమర్శలు
BJP criticizes Rahul Gandhi as Chunav Hindu: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తెల్లటి ధోతీ, నుదిటిపై విభూతి ధరించి మహాకాల్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఆలయాన్ని సందర్శించడంపై బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో హిందువుల ఓట్లను పొందేందుకే రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శిస్తున్నారంటూ విమర్శించింది… -
Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా
Mehbooba Mufti backs Israeli filmmaker's remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. దీనిపై నాదవ్ లాపిడ్… -
India’s GDP: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా భారత వృద్ధిరేటు
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4గా ఉంది. -
PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. -
China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
China warns US not to interfere in its relationship with India: భారత్-యూఎస్ఏ మిలిటరీ డ్రిల్స్పై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైనిక విన్యాసాలు జరగడంపై అభ్యంతరం తెలిపింది. భారత్-అమెరికా దేశాలు ఎల్ఎసీకి సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘యుధ్ అభ్యాస్’పేరుతో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇది తనకు ప్రమాదంగా భావిస్తోంది జిత్తులమారి చైనా. ఈ… -
China: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత..ఇతని హయాంలోనే ఆర్థిక శక్తిగా చైనా
China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు... గొప్ప మార్క్సిస్ట్, గొప్ప శ్రామికవర్గ విప్లవకారుడు,…
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
-
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
-
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!