Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- గిల్గిట్-బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కోరిన అసెంబ్లీ.
- అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం.
- జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి.
- గిల్గిట్-బాల్టిస్తాన్ భారత్ అంతర్భాగమేనన్న భారత వైఖరి యథాతథం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెరచాటున భారత్ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. పీఓకేలో భాగంగా ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ను పాకిస్తాన్ తన భూభాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్లో 5వ ప్రావిన్సుగా(రాష్ట్రం) ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే 4 ప్రావిన్సులు ఉన్నాయి.
పాకిస్తాన్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు ఇవ్వడం విశేషం. అసెంబ్లీలో ఎమ్మెల్యే జలాల్ అలీ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2009లో గిల్గిత్-బాల్టిస్తాన్ (ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్-గవర్నెన్స్) ఆర్డర్ ద్వారా శాసనసభ ఏర్పడింది. 2018 గిల్గిట్-బాల్టిస్తాన్ ఆర్డర్ ద్వారా శాసనసభకు మరిన్ని చట్టసభ అధికారాలు కల్పించిన విషయాన్ని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్లో తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి, గిల్గిట్-బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ హోదా లభిస్తే ఇక్కడి ప్రజలకు పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేదిగా ఉంది. గిల్గిట్-బాల్టిస్తాన్ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్లతో పాటు భారత్లో అంతర్భాగమే అని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల హోదాను మార్చేందుకు పాకిస్తాన్ చేపట్టే ఏ చర్యకు కూడా చట్టబద్ధత లేదని, వాటితో వాస్తవ పరిస్థితి మారదని భారత్ పలుమార్లు పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!