Shraddha Walkar Case: శ్రద్ధ హత్య కేసు ఛార్జిషీట్ లో సంచలన విషయాలు.. ఎముకలను పౌడర్ చేసే యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walkar Case: దేశంతో సంచలనం సృష్టించింది శ్రద్ధావాకర్ మర్డర్ కేసు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను అతడి లవర్ అఫ్తాబ్ పూనావాలా హత్య చేయడంతో పాటు శరీరాన్ని 35 ముక్కులుగా చేసి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పారేశాడు. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ సంఘటన మే 18, 2022న జరిగితే దాదాపుగా ఆరు నెలల తరువాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో పోలీసుల ఛార్జిషీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రద్ధా వాకర్ ని హత్య చేసిన తర్వాత ఆమె ఎముకలనను పౌడర్ చేసేందుకు అఫ్తాబ్ ప్రయత్నించాడు. మిక్సర్ ఉపయోగించి ఎముకలను పౌడర్ చేయాలని భావించాడని, మూడు నెలల తర్వాత శ్రద్ధా తలను పారేశాడని పోలీసుల ఛార్జిషీట్ లో పేర్కొంది. ఈ కేసులో 6600 పేజీల ఛార్జిషీట్ ఫైల్ చేశారు పోలీసులు. శ్రద్ధా మొబైల్ ఫోన్ ను ముంబైలో పారేసినట్లు ఛార్జిషీట్ లో వెల్లడిస్తోంది. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ కు పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో-అనాలిసిస్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండు టెస్టుల్లో కూడా శ్రద్ధా వాకర్ ని హత్య తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
ఛార్జీషీట్ లో వివరాల ప్రకారం.. అఫ్తాబ్ కు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండటంతో తరుచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. హత్యా తరువాత అఫ్తాబ్ ఇతర గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన సందర్భంలో శరీర అవయవాలను కిచెన్ లో పెట్టి వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ ఫ్రిజ్ లో పెట్టేవాడు. శరీరాన్ని కోయడానికి రంపం, సుత్తి, 3 కత్తులను ఉపయోగించాడు. మే 18, 2022 తర్వాత అఫ్తాబ్ ఫోన్ నుండి శ్రద్ధా అకౌంట్లు ఉపయోగించాడని గూగుల్ విశ్లేషన వెల్లడించింది. మే 18 రాత్రి, ఆఫ్తాబ్ తన కోసం ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి చికెన్ రోల్ ఆర్డర్ చేశాడు, అదే రోజు శ్రద్ధ హత్యకు గురైంది. హత్య తరువాత పెద్ద ఎత్తున వాటర్ బాటిళ్లను అఫ్తాబ్ ఆర్ఢర్ చేశాడు.
శద్ధా ఛాతిపై కూర్చోని, చనిపోయే వారకు గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని బాత్రూంలో దాచాడు. రక్తాన్ని శుభ్రం చేయడానికి రెండు 500 ఎంఎల్ హార్పిక్ బాటిళ్లను, చాపింగ్ బోర్డు, 2,500 ఎంఎల్ షైన్ఎక్స్ గ్లాస్ క్లీనర్, 725 ఎంఎల్ గోద్రెజ్ ప్రొటెక్ట్ జెర్మ్ ఫైటర్ ఆక్వా లిక్విడ్ హ్యాండ్ వాష్ బాలిల్ ను బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసినట్లు ఛార్జీషీట్ లో పేర్కొన్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..