Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదవికి రాజీనామా చేసింది. ఆ తరువాత భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా నియమితులయ్యారు.
Read Also: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..
Also Read
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యూకే ద్రవ్యోల్భణం కారణంగా భారతీయ విద్యార్థులు మరింతగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ.. జీవినం కోసం క్లాసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థుల జీవితం దుర్భరంగా మారుతున్నాయి. ఫుడ్, ఇతర అవసరాల కోసం మరిన్ని పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. అధిక అద్దెలు, ఉద్యోగాల కొరత, స్థానిక విద్యార్థులతో పోలిస్తే ట్రిపుల్ ట్యూషన్ ఫీజులు, వసతి కొరత, ద్రవ్యల్భణంతో పెరుగుతున్న ఖర్చులు చదువు కోసం యూకే వెళ్లిన వారికి ఇబ్బందులుగా మారాయి.
చాలా మంది ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. చదువు కోసం చిక్కుకుపోయారని లండన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి యూకే వెళ్లిన ధరిన్ పటేల్ అన్నారు. నేను కూడా భారత్ తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పులు తీసుకుని చదివేందుకు యూకే వెళ్లిన వారు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ లో డబ్బులు సరిపోక ఇంటి నుంచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తోంది. యూకేలో చైనీయులు తరువాత ఇండియా నుంచే ఎక్కువ మంది చదువుకోవడానికి వస్తున్నారు. 2022లో, 143,820 మంది చైనీస్ విద్యార్థులు చదువుకోవడానికి యూకే వెళ్తే.. భారతదేశం నుండి వారి సంఖ్య 84,555 మంది వెళ్లారు.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!