Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదవికి రాజీనామా చేసింది. ఆ తరువాత భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా నియమితులయ్యారు.
Read Also: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యూకే ద్రవ్యోల్భణం కారణంగా భారతీయ విద్యార్థులు మరింతగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ.. జీవినం కోసం క్లాసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థుల జీవితం దుర్భరంగా మారుతున్నాయి. ఫుడ్, ఇతర అవసరాల కోసం మరిన్ని పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. అధిక అద్దెలు, ఉద్యోగాల కొరత, స్థానిక విద్యార్థులతో పోలిస్తే ట్రిపుల్ ట్యూషన్ ఫీజులు, వసతి కొరత, ద్రవ్యల్భణంతో పెరుగుతున్న ఖర్చులు చదువు కోసం యూకే వెళ్లిన వారికి ఇబ్బందులుగా మారాయి.
చాలా మంది ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. చదువు కోసం చిక్కుకుపోయారని లండన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి యూకే వెళ్లిన ధరిన్ పటేల్ అన్నారు. నేను కూడా భారత్ తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పులు తీసుకుని చదివేందుకు యూకే వెళ్లిన వారు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ లో డబ్బులు సరిపోక ఇంటి నుంచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తోంది. యూకేలో చైనీయులు తరువాత ఇండియా నుంచే ఎక్కువ మంది చదువుకోవడానికి వస్తున్నారు. 2022లో, 143,820 మంది చైనీస్ విద్యార్థులు చదువుకోవడానికి యూకే వెళ్తే.. భారతదేశం నుండి వారి సంఖ్య 84,555 మంది వెళ్లారు.
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..