Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదవికి రాజీనామా చేసింది. ఆ తరువాత భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా నియమితులయ్యారు.
Read Also: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యూకే ద్రవ్యోల్భణం కారణంగా భారతీయ విద్యార్థులు మరింతగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ.. జీవినం కోసం క్లాసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థుల జీవితం దుర్భరంగా మారుతున్నాయి. ఫుడ్, ఇతర అవసరాల కోసం మరిన్ని పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. అధిక అద్దెలు, ఉద్యోగాల కొరత, స్థానిక విద్యార్థులతో పోలిస్తే ట్రిపుల్ ట్యూషన్ ఫీజులు, వసతి కొరత, ద్రవ్యల్భణంతో పెరుగుతున్న ఖర్చులు చదువు కోసం యూకే వెళ్లిన వారికి ఇబ్బందులుగా మారాయి.
చాలా మంది ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. చదువు కోసం చిక్కుకుపోయారని లండన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి యూకే వెళ్లిన ధరిన్ పటేల్ అన్నారు. నేను కూడా భారత్ తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పులు తీసుకుని చదివేందుకు యూకే వెళ్లిన వారు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ లో డబ్బులు సరిపోక ఇంటి నుంచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తోంది. యూకేలో చైనీయులు తరువాత ఇండియా నుంచే ఎక్కువ మంది చదువుకోవడానికి వస్తున్నారు. 2022లో, 143,820 మంది చైనీస్ విద్యార్థులు చదువుకోవడానికి యూకే వెళ్తే.. భారతదేశం నుండి వారి సంఖ్య 84,555 మంది వెళ్లారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!