Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో పదవికి రాజీనామా చేసింది. ఆ తరువాత భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా నియమితులయ్యారు.
Read Also: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే ఆర్థిక పరిస్థితులు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యూకే ద్రవ్యోల్భణం కారణంగా భారతీయ విద్యార్థులు మరింతగా పనిచేయాల్సి వస్తోంది. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ.. జీవినం కోసం క్లాసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థుల జీవితం దుర్భరంగా మారుతున్నాయి. ఫుడ్, ఇతర అవసరాల కోసం మరిన్ని పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. అధిక అద్దెలు, ఉద్యోగాల కొరత, స్థానిక విద్యార్థులతో పోలిస్తే ట్రిపుల్ ట్యూషన్ ఫీజులు, వసతి కొరత, ద్రవ్యల్భణంతో పెరుగుతున్న ఖర్చులు చదువు కోసం యూకే వెళ్లిన వారికి ఇబ్బందులుగా మారాయి.
చాలా మంది ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. చదువు కోసం చిక్కుకుపోయారని లండన్ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి యూకే వెళ్లిన ధరిన్ పటేల్ అన్నారు. నేను కూడా భారత్ తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పులు తీసుకుని చదివేందుకు యూకే వెళ్లిన వారు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా పార్ట్ టైమ్ జాబ్స్ లో డబ్బులు సరిపోక ఇంటి నుంచి డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తోంది. యూకేలో చైనీయులు తరువాత ఇండియా నుంచే ఎక్కువ మంది చదువుకోవడానికి వస్తున్నారు. 2022లో, 143,820 మంది చైనీస్ విద్యార్థులు చదువుకోవడానికి యూకే వెళ్తే.. భారతదేశం నుండి వారి సంఖ్య 84,555 మంది వెళ్లారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..