Venu Goapl Reddy
Author- NTV Telugu-
Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..
Who is Shah Rukh Khan? Assam CM Himanta Biswa Sarma asked: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామంటూ పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
BBC Documentary on Modi: మోదీ డాక్యుమెంటరీ వెనక పాకిస్తాన్ వ్యక్తులు ఉన్నారా..? బీబీసీపై బ్రిటన్ ఎంపీ ఆగ్రహం
BBC Documentary on Modi: 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు సీరీస్ లను బీబీసీ రూపొందించింది. అయితే ఈ డ్యాక్యుమెంటరీపై భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం బీబీసీ చర్యలను ఖండించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ ఎంపీ ప్రధాని మోదీపై చర్చను లేవనెత్తాడు. అయితే ప్రధాని రిషి సునాక్, వ్యక్తిగతంగా ఆరోపణలు… -
China: చైనాలో కోవిడ్ కల్లోలం..ఏకంగా 80 శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్
Covid Situation in China: కరోనా మహమ్మారి పుట్టిన చైనా ఇప్పుడు ఆ వైరస్ తోనే అల్లాడుతోంది. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా చైనాలో కోవిడ్ 19 కేసులు నమోదు అవుతున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ధాటికి చైనా ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చైనాలో 80 శాతం మంది ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు అక్కడి ప్రభుత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రెండు మూడు నెలల్లో అతిపెద్ద కోవిడ్ 19 వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని అన్నారు. -
Twitter Layoffs: ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్న ట్విట్టర్.. త్వరలో మరింత మంది ఔట్
Twitter Layoffs: ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్ తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ట్రెండ్ మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట, అమెజాన్ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను విడిచిపెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. -
Bihar Politics: సీఎం నితీష్ కుమార్ కు బీజేపీ స్కెచ్..? కీలక జేడీయూ నేతతో బీజేపీ నేతలు భేటీ
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో ఎన్డీయేలో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. ఆ పొత్తు కాదనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గతం నుంచి బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జేడీయూ చీల్చి అధికారం ఏర్పాటు చేయాలనుకుంటుందనే ఆరోపణతోనే… -
Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..
Man Chops Private Part: భార్యభర్తల గొడవ భర్త ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదని ఓ వ్యక్తి ఏకంగా ప్రైవేటు పార్ట్ ను కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహారలోని మాధేపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రజనీ నయానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసిన బంధువులు స్థానికంగా ఉన్న వైద్య కళాశాలకు తరలించారు. -
BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దేశంతో పాటు బ్రిటన్ లో కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ.. బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’అనే పేరుతో రెండు భాగాల సిరీస్ రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. దీన్ని వలసవాద మనస్తత్వంగా -
India-China Border: చైనా బోర్డర్లో ఇండియా భారీ సైనిక విన్యాసాలు.. జిన్పింగ్ వ్యాఖ్యలతో అలర్ట్
Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. -
Abdul Rehman Makki: కాశ్మీర్ పాకిస్తాన్ జాతీయ సమస్య.. గ్లోబల్ ఉగ్రవాది మక్కీ..
Global terrorist Abdul Makki calls Kashmir 'Pakistan's national issue': పాకిస్తాన్ దేశానికి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ గురించి వ్యాఖ్యలు చేశాడు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ ని పాకిస్తాన్ జాతీయ సమస్యగా పేర్కొన్నాడు. ఇటీవల చైనా పట్టువీడటంతో ఐక్యరాజ్యసమితి అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరేతోయిబా (ఎల్ఇటి) డిప్యూటీ లీడర్ గురువారం లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలు నుండి ఒక వీడియోను విడుదల చేశాడు. తనకు అల్… -
IT Layoffs: ఆర్థికమాంద్యం భయాలు.. ఐటీ రంగంలో సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు
IT Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని అంచానా వేసింది. గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రపంచం అంతా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన…
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!