Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ మొదలైంది.
PM Modi's tweet on Puneeth Rajkumar's last film: దివంగత సినీ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘ గంధాడ గుడి’పై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గంధాడ గుడి సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది మరణించిన కన్నడు నటుడు పునీత్ రాజ్ కుమార్ ను స్మరిస్తూ.. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా పునీత్ రాజ్ కుమార్ భార్య రీట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ లో ‘‘…
Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కరెంట్ షాక్ కు గురైంది.
Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్ రాజుగా ఉన్నారని.. తయన పార్టీ పన్నులు…
MK Stalin Elected As DMK Chief For 2nd Time: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహిాంచిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన్న పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ముగ్గురు నేతలు…
Over 50 students mysteriously poisoned in Mexico school in mexico: మెక్సోకో దేశంలో 57 మంది చిన్నారులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులు గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత లేబొరేటరీ పరిశోధనల్లో విద్యార్థులు కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్లే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం…
Super continent on Earth in 200 million years: భూమిపై ప్రస్తుతం ఏడు ఖండాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఖండం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చైనా పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే 200-300 మిలియన్ సంవత్సరాల్లో ఆసియా, అమెరికా ఖండం కలిసిపోయి ఒక కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఖండానికి ‘అమాసియా’ అనే పేరును పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా లోని కార్టిన్…
Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవాంర రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు…
PM Modi To Declare Modhera As India's 1st Solar-Powered Village: దేశంలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ ఎనర్జీ, విద్యుత్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ముడి చమురు దిగుమతిని తగ్గించుకుని, విదేశీమారక నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా గుజరాత్ రాష్ట్రంలో మోధేరా గ్రామం రికార్డులకెక్కనుంది. గుజరాత్ రాష్ట్రంలోని మోహసానా జిల్లాలో ఉంది మాధేరా.
Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్ ఎటాక్ జరిగింది.