Venu Goapl Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh: కదులుతున్న రైలులో మహిళపై టీటీఈ అత్యాచారం..
Woman Gangraped By TTE, Another Man On Moving Train: ఉత్తర్ ప్రదేశ్ లొో ఘోరం జరిగింది. కదులుతున్న రైలులో ఓ మహిళపై టీటీఈ, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడైన టీటీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అత్యాచార ఘటన జనవరి 16న సంభాల్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. -
Gujarat Court: ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్కు ప్రభావితం కావు..
Gujarat Court Verdict on Cow Smuggling: అక్రమంగా పశువు రవాణా చేసిన వ్యక్తి కేసులో తీర్పు చెబుతూ గుజరాత్ కోర్టు కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమిపై అన్ని సమస్యలు తీరుతాయని.. తాపి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తి ఎస్వీ వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్ నుంచి ప్రభావితం కావు అని.. ఆవు మూత్రం అనేక నయం లేని రోగాలకు నివారణ అని అన్నారు. ఆవు… -
Pakistan: పాక్లో హిందువులపై ఆగని అఘాయిత్యాలు.. హిందూ బాలిక కిడ్నాప్, అత్యాచారం
Married Hindu girl abducted in Pakistan, raped: పాకిస్తాన్ లో మైానారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రాంతంలోని థార్, ఉమర్కోట్, మీర్పుర్ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్పూర్ ప్రాంతాలలో హిందూ యువతులు, బాలిక అపహరణ కొనసాగుతూనే ఉంది. హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎదిరిస్తే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. -
Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..
Google Layoff: ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
Siddaramaiah: హిట్లర్, ముస్సోలినీకి ఏమైంది.. మోదీకి కూడా అలాగే…
Siddha Ramaiah criticizes Prime Minister Narendra Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హిట్లర్, ముస్సోలినీలతో పోల్చాడు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పాడు. ప్రధానమంత్రిని రానీవ్వండి మాకు ఎలాంటి సమస్య లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని వందసార్లు చెప్పినా.. అలా జరగదని సిద్ధరామయ్య ఆదివారం స్పష్టం చేశారు. -
IT layoffs: 4 నెలల్లో 3 కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించాయి.. ఓ టెక్కీ ఆవేదన
Laid off 3 times in 4 months: చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు. నిర్ధయగా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేశాయి. కొత్త పాత… -
PM Narendra Modi: అత్యంత పవర్ ఫుల్ ప్రధానుల్లో మోడీ ఒకరు.. బ్రిటన్ ఎంపీ ప్రశంసలు
PM Modi is one of the most powerful persons on planet: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఇటు ఇండియాలోను అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు. తాజాగా యూకే చట్టసభ సభ్యుడు కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ.. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని ఆయన అన్నారు. -
Kiren Rijiju: సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువా..? మోదీ డాక్యుమెంటరీపై కేంద్రమంత్రి
BBC Documentary on Modi: భారతదేశంలో కొంతమంది సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువ అని భావిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొంతమందిని సంతోషపెట్టడానికి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని.. వారు దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలో అయినా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
Road Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడానికి రోడ్లు బాగుండడమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే విశ్లేషణ
BJP MLA Blames Good Roads For Rise In Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడంపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే ఫన్నీ విశ్లేషణ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు మించి రోడ్లే కారణం అని అన్నాడు. రోడ్లు బాగుంటే అధికవేగంగా వాహనాలు వెళ్తాయని.. వాహనాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. -
Dinosaur Nests: మధ్యప్రదేశ్ నర్మదా లోయలో 256 డైనోసార్ గుడ్లు..
Dinosaur Nests And 265 Eggs Found In Madhya Pradesh’s Narmada Valley: మానవుడి మనుగడ లేని సమయంలో డైనోసార్లు ఈ భూమిని ఏలాయి. దీనిపై పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చాలా చోట్ల డైనోసార్లకు సంబంధించి శిలాజాలు లభించాయి. క్రెటేషియస్ యుగం ముగిసే సమయానికి డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదిలా ఉంటే ఇటీవల మధ్యప్రధేశ్ నర్మదా లోయలో డైనోసార్ గూళ్లు, శాకాహార టైటానోసార్లకు సంబంధించి 256 గుడ్లను శిలాజ శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!