Venu Goapl Reddy
Author- NTV Telugu-
Congress: విదేశాల జోక్యంతో తత్వం బోధపడింది… రాహుల్ విషయంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని జర్మనీ పేర్కొంది. -
Howrah Ram Navami clashes: హౌరా రామనవమి ఊరేగింపులో అల్లర్లు.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది. -
Helicopters Crash: బ్లాక్ హాక్ హెలికాప్టర్లు క్రాష్.. 9 మంది యూఎస్ సైనికులు మృతి
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు. -
New Parliament: కొత్త పార్లమెంట్ అదిరింది.. ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..
New Parliament: ప్రధాని నరేంద్రమోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కార్మికులతో ముచ్చటించారు ప్రధాని. దాదాపుగా గంట పాటు అక్కడే గడిపారు. పనులను క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. కొత్త పార్లమెంట్ ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ఇదే కొత్త కాదు. గతంలో సెప్టెంబర్ 2021లో కూడా ఇలాగా పార్లమెంట్ కాంప్లెక్స్ ను మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
AAP: మోదీ నిరక్షరాస్యుడు.. భారత్ కు చదువుకున్న ప్రధాని కావాలి.
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది. -
Mamata Banerjee: శ్రీరామ నవమిని జరుపుకోండి.. కానీ ముస్లిం ఏరియాలకు దూరంగా ఉండండి
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని విడిచిపెట్టవని హెచ్చరించారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీపై జర్మనీ వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై కేంద్రమంత్రుల విమర్శలు..
Rahul Gandhi: రాహుల్ గాంధీ జైలుశిక్ష, అనర్హత వేటు గురించి జర్మనీ స్పందించింది. ఈ అంశాన్ని గమనిస్తున్నామంటూ ఆ దేశ విదేశాంగ శాఖ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో జర్మనీ కలుగజేసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. -
26/11 Mumbai Attack: ముంబై దాడి సూత్రధారులు “భారీ మూల్యం” చెల్లించాల్సిందే.. ఇజ్రాయిల్ వార్నింగ్..
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు. -
World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..
World Idli Day: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రాంతాల వారీగా ప్రజలు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు మారుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో వంటల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా బియ్యం ప్రధానంగా ఉంటే ఇడ్లీలు, దోశెలు, ఊతప్ప ఇలాంటి టిఫిన్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా అల్పహారంలో ఇడ్లీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి 30ని ‘‘అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం’’గా జరుపుకుంటారు. -
IPL 2023: ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటర్లు వీరే..
Fastest Half-Centuries In IPL History: ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపటి నుంచి క్రికెట్ లవర్స్ కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వినోదం పంచబోతోంది. రేపు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడబోతున్నాయి. ఐపీఎల్ అంటేనే ఊర కొట్టడు.. 20 ఓవర్లలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తుంటుంది. రేపు ప్రారంభం అవబోతున్న ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీపడుతాయి. రెండు నెలల పాటు వినోదాన్ని పంచబోతోంది. Read Also: Rahul […]
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!