Nashik Bus Accident: మహారాష్ట్రలో ఘోరం.. బస్సులో మంటలు చెలరేగి 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik Fire Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 11 మంది మరణించారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి యావత్మాల్ నుంచి నాసిక్ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు నాసిక్-ఔరంగాబాద్ రోడ్డులోని హెటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. బస్సు డిజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులంతా నిద్ర పోతుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు బస్సు నుంచి దూకేశారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది ప్రయాణికులు అందులో చిక్కుకు పోయారు.
Read Also: Blast in Police Station: పోలీస్స్టేషన్లో అర్ధరాత్రి భారీ పేలుడు..
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. బస్సు నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గాయపడినవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింతగా మరణాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
నాసిక్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..