Vande Bharat Express: 24 గంటల్లోనే వందేభారత్ ఎక్స్ప్రెస్కు రిపేర్.. నిన్న ట్రైన్కు ప్రమాదం.
Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలు చిన్న ప్రమాదానికే దెబ్బతిందంటూ.. ఓ సెక్షన్ ప్రజలు విపరీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించారు. ట్రోలర్స్ పండగ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న భాగాన్ని కేవలం 24 గంటల్లోనే అమర్చారు రైల్వే అధికారులు. దెబ్బతిన్న నోస్ భాగాన్ని ముంబై సెంట్రల్ లోని కోచ్ కేర్ సెంటర్ లో రిపేర్ చేశారు. మళ్లీ యథావిధిగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రెడీ అయిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ అన్నారు.
Also Read
Read Also: Viral Video: ఈ పోలీస్ రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడాడు
గురువారం అహ్మదాబాద్ కు సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వేస్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ముందుభాగం లేకుండానే గాంధీ నగర్, ముంబై సెంట్రల్ మధ్య ట్రైన్ ప్రయాణించింది. ట్రైన్ ముందు భాగం ప్రమాదాలను తట్టుకుని, ట్రైన్ పనిచేసే విభాగాలను దెబ్బతియకుండా ఉంటుంది. అందుకే ప్రమాదం సమయాల్లో ట్రైన్ ముందు భాగం దెబ్బతినడం కామన్ గా జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అదనపు సమయం లేకుండా రైలు దెబ్బతిన్న భాగాన్ని సరిచేశామని సుమిత్ ఠాకూర్ వెల్లడించారు.
స్వదేశీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. సెమీ హైస్పీడ్ వేగంతో వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. వందేభారత్ సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 30న గాంధీ నగర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. తరువాతి రోజు నుంచే గాంధీ నగర్ – ముంబై మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీస్తోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో