Vande Bharat Express: 24 గంటల్లోనే వందేభారత్ ఎక్స్ప్రెస్కు రిపేర్.. నిన్న ట్రైన్కు ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలు చిన్న ప్రమాదానికే దెబ్బతిందంటూ.. ఓ సెక్షన్ ప్రజలు విపరీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించారు. ట్రోలర్స్ పండగ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న భాగాన్ని కేవలం 24 గంటల్లోనే అమర్చారు రైల్వే అధికారులు. దెబ్బతిన్న నోస్ భాగాన్ని ముంబై సెంట్రల్ లోని కోచ్ కేర్ సెంటర్ లో రిపేర్ చేశారు. మళ్లీ యథావిధిగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రెడీ అయిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ అన్నారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: Viral Video: ఈ పోలీస్ రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడాడు
గురువారం అహ్మదాబాద్ కు సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వేస్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ముందుభాగం లేకుండానే గాంధీ నగర్, ముంబై సెంట్రల్ మధ్య ట్రైన్ ప్రయాణించింది. ట్రైన్ ముందు భాగం ప్రమాదాలను తట్టుకుని, ట్రైన్ పనిచేసే విభాగాలను దెబ్బతియకుండా ఉంటుంది. అందుకే ప్రమాదం సమయాల్లో ట్రైన్ ముందు భాగం దెబ్బతినడం కామన్ గా జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అదనపు సమయం లేకుండా రైలు దెబ్బతిన్న భాగాన్ని సరిచేశామని సుమిత్ ఠాకూర్ వెల్లడించారు.
స్వదేశీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. సెమీ హైస్పీడ్ వేగంతో వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. వందేభారత్ సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 30న గాంధీ నగర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. తరువాతి రోజు నుంచే గాంధీ నగర్ – ముంబై మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!