Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
బంగ్లాదేశ్ లోని జునైదా జిల్లాలోని దౌతియా గ్రామంలో కాళీ ఆలయంపై దాడి చేసి.. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆలయ ప్రాంగణం నుంచి కిలోమీటర్ దూరంలో విగ్రహ ముక్కలను పడేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు సుకుమార్ కుంటను వెల్లడించారు. ఈ కాళీ ఆలయం అవిభక్త భారతదేశంలో పురాతన ఆలయంగా ఉంది. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు జరిగేవి.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also: Mohan Bhagwat: వర్ణం, జాతి భావనలను అంతా గతం.. మరిచిపోవాలి.
బంగ్లాదేశ్ లో 10 రోజు పాటు దుర్గా పూజ ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జునైడా లోని ఆలయంలో రాత్రి ఘటన జరిగిందని బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ తెలిపారు. 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి సంఘటను జరగలేదని.. ఆలయంపై దాడి దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ బర్మన్ తెలిపారు. ఈ ఒక్క సంఘటన మినహాయిస్తే బంగ్లాదేశ్ వ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రశాంతంగా జరిగాయి.
గతేడాది దుర్గా నవరాత్రుల్లో ఏర్పడిన మతఘర్షణల్లో ఆరుగురు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ముస్లిం మెజారిటీ అయిన బంగ్లాదేశ్ లో మొత్తం 16.9 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 10 శాతం హిందువులు ఉన్నారు.
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..