Off The Record: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా?
- కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారన్న మైనంపల్లి
- కోవర్ట్లతోనే పార్టీ నిర్ణయాలు లీక్ అవుతున్నాయని కామెంట్
- హరీష్రావుకు ఇప్పటికీ అధికారులపై పట్టుందని సంచలన వ్యాఖ్యలు
- కోవర్ట్ సిస్టం పోతే వంద శాతం పంచాయతీలు గెలుస్తామన్న మైనంపల్లి
- మైనంపల్లే అందర్నీ కలుపుకుని పోవడం లేదని మరో వెర్షన్
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో చాలాచోట్ల కాంగ్రెస్ రెబెల్స్ గెలుపు
- కాంగ్రెస్ రెబెల్స్కు బీఆర్ఎస్ సాయం చేసిందన్న ఆరోపణలు
- మైనంపల్లి వైఖరివల్లే రెబెల్స్ పెరిగారన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్ఎస్ ఆఫీస్కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ అధికారం కోల్పోయినా మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇప్పటికీ పోలీసులు, అధికారులపై పూర్తిస్థాయి కమాండ్ ఉందని చెప్పి ఇంకో సంచలనానికి తెర తీశారు మైనంపల్లి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నారని, వాళ్ళ వల్ల కాంగ్రెస్కు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారాయన. ఈ కోవర్ట్ సిస్టం పోతే తాము వంద శాతం గెలుస్తామన్నది మాజీ ఎమ్మెల్యే మాట. మెదక్ నియోజకవర్గంలో 75 శాతం మేర పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని, కోవర్ట్ రాజకీయాలు లేకుంటే గనక ఈ పర్సంటేజ్ ఇంకా పెరిగి ఉండేదన్నది మైనంపల్లి విశ్లేషణ.
READ ALSO: VC Sajjanar: నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు: సీపీ సజ్జనర్
Also Read
మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేశారని, ఆ ప్రభావంతోనే డబ్బులు లేనిదే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇలా… రకరకాల కోణాల్లో మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, వారివల్లే పంచాయితీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని అనడంలో ఆంతర్యం ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారు. మైనంపల్లి వ్యాఖ్యల్లో నిజం ఉందా, లేదా? ఒకవేళ లేకుంటే గనక ఆయన టార్గెట్ ఏంటన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. అదే సమయంలో హన్మంతరావు కాంగ్రెస్ నేతలందర్నీ కలుపుకుని పోవడం లేదని, మండల స్థాయి నాయకులు కలిసేందుకు సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక మెదక్ జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు లేడు. దీంతో ఆ రెండు చోట్ల ఆయనే పెద్ద దిక్కులా మారారు. మైనంపల్లి మనుషులే పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలుగా చెలామణి అవుతున్నారు. అలాంటప్పుడు హన్మంతరావు ఎవర్ని తప్పు పడతారన్నది ఇంకొందరి ప్రశ్న.
మెదక్, సిద్దిపేట జిల్లాల్లో చాలా గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ ఎక్కువగా పోటీ చేసి గెలిచారు. వాళ్ళకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేసి గెలిపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని పని చేస్తే… చివరికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా మైనంపల్లి అవకాశం ఇవ్వకపోవడంవల్లే వాళ్ళు రెబెల్స్గా బరిలో దిగారని, వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకుంటే…. చేసుకుని ఉండవచ్చన్నది కొందరు కాంగ్రెస్ నేతల మాట. అలాగే పార్టీ సీనియర్లతో మైనంపల్లి హన్మంతరావుకు సఖ్యత లేదని… అందర్నీ కలుపుకోకపోవడం వల్లే కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు ఓడిపోయారన్న వెర్షన్ సైతం ఉంది. తాను చెప్పినట్టు వినని, తన దగ్గరకు రాని నాయకులందరిపై బీఆర్ఎస్ కోవర్టులంటూ ముద్ర వేస్తున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. మైనంపల్లి వ్యాఖ్యలపై పిసిసి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
READ ALSO: IND vs SA 4th T20: భారత్- సౌతాఫ్రికా 4వ T20 మ్యాచ్ రద్దు..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!