Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ ప్రమాదానికి కారణం అయిన గేదెల యజమానులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరిపై గుజరాత్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పశువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు గేదెల యజమానులను పోలీసులు గుర్తించలేదు. వీరికోసం గాలిస్తున్నారు. రైల్వే చట్టం – 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. నాలుగు గేదెలు మృతి చెందిన ఘటనపై గురువారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
Read Also: BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
గురువారం అహ్మదాబాద్ సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ మధ్యలో వందే భారత్ ట్రైన్ గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. నిన్న జరిగిన ప్రమాదంలో కేవలం లోకో పైలెట్ కోచ్ ముక్కు భాగం స్వల్పంగా దెబ్బతింది. రైలులోని ప్రధాన వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే దెబ్బతిన్న భాగాన్ని రైల్వే అధికారులు కేవలం 24 గంటల్లోపు సరిచేశారు.
సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ తరువాతి రోజు నుంచే ఇది గాంధీ నగర్- ముంబైల మధ్య పరుగులు తీస్తోంది. భారత ప్రభుత్వ రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!