Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ ప్రమాదానికి కారణం అయిన గేదెల యజమానులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరిపై గుజరాత్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పశువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు గేదెల యజమానులను పోలీసులు గుర్తించలేదు. వీరికోసం గాలిస్తున్నారు. రైల్వే చట్టం – 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. నాలుగు గేదెలు మృతి చెందిన ఘటనపై గురువారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
Read Also: BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
గురువారం అహ్మదాబాద్ సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ మధ్యలో వందే భారత్ ట్రైన్ గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. నిన్న జరిగిన ప్రమాదంలో కేవలం లోకో పైలెట్ కోచ్ ముక్కు భాగం స్వల్పంగా దెబ్బతింది. రైలులోని ప్రధాన వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే దెబ్బతిన్న భాగాన్ని రైల్వే అధికారులు కేవలం 24 గంటల్లోపు సరిచేశారు.
సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ తరువాతి రోజు నుంచే ఇది గాంధీ నగర్- ముంబైల మధ్య పరుగులు తీస్తోంది. భారత ప్రభుత్వ రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!