PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
- ప్రత్యేక విందులో సాంస్కృతిక కార్యక్రమం
- ఇథియోపియా కళాకారులు భారత జాతీయ గీతం “వందేమాతరం”ను ఆలాపన.
- వందేమాతరం ఆలాపనను ఆస్వాదించిన ప్రధాని మోదీ
- చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ ఆనందంతో స్పందన.
- అభినందించిన మోదీ వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్లో మోడీ ప్రసంగం..
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
మంగళవారం నాడు అడిస్ అబాబా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని స్వయంగా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వాగతించారు. అంతేకాదు.. ఆయన స్వయంగా వాహనం నడుపుతూ మోదీని హోటల్కు తీసుకెళ్లడం అరుదైన ఘటనగా నిలిచింది. మంగళవారం సాయంత్రం ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా మారింది. భోజన కార్యక్రమానికి తోడు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఇథియోపియా కళాకారులు “వందేమాతరం”ను మనసుకు హత్తుకునేలా ఆలపించారు. ఈ ప్రదర్శనను ఆస్వాదించిన ప్రధాని మోదీ కళాకారులను చప్పట్లతో అభినందించారు. ఆ సందర్భంలో అచ్చం ఓ పిల్లడు ఎలా ఆనందాన్ని ఆస్వాదిస్తాడో అలా ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. “నిన్న ప్రధాని అబియ్ అహ్మద్ అలీ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం అద్భుతంగా పాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ అనుభూతి మరింత భావోద్వేగంగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రదర్శన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్, ఆఫ్రికా సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆఫ్రికా దేశాలతో దౌత్య, అభివృద్ధి సంబంధాలు మరింత వేగం పుంజుకున్నాయి.
At yesterday’s banquet dinner hosted by Prime Minister Abiy Ahmed Ali, a wonderful rendition of Vande Mataram was sung by Ethiopian singers. It was a deeply moving moment, that too at a time when we are marking 150 years of Vande Mataram. @AbiyAhmedAli pic.twitter.com/TeHbPzBBLb
— Narendra Modi (@narendramodi) December 17, 2025
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!