Venu Goapl Reddy
Author- NTV Telugu-
IIT-Madras: ఐఐటీ మద్రాస్లో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో మూడో ఘటన..
IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
Congress Files: కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ వీడియో ప్రచారం..
Congress Files: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పాటు వరసగా ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. -
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముస్సోరీ డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్కు తిరిగి వస్తుండగా షేర్ఘాడీ సమీపంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. -
Rajnath Singh: ఆల్ టైం హైకి భారత రక్షణరంగ ఎగుమతులు..
Rajnath Singh: భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలు తమ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేసేలా, తద్వారా సాంకేతికలను… -
PM Narendra Modi: నన్ను కించపరిచేందుకు చాలా కష్టపడుతున్నారు.. కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ ప్రధాని విమర్శలు..
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. -
Navjot Sidhu: రాహుల్ నేతృత్వంలో విప్లవం వచ్చింది.. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీకి సిద్ధూ స్ట్రాంగ్ మెసేజ్..
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ కామెంట్స్ చేశారు. -
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ట్రైన్.. కొత్తగా ఈ రూట్లలో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్..
Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే… -
PM Modi: వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్పై “ఏప్రిల్ ఫూల్” కామెంట్స్..
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని… -
Nitish Kumar: రాజకీయ దురుద్దేశంతోనే రామ నవమి రోజున మత ఘర్షణలు..
Nitish Kumar: శ్రీరామ నవమి రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో రామనవమి ఉత్సవాల సందర్భంగా మతపరమైన ఉద్రికత్తలు చెలరేగడంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాజకీయ దురుద్దేశం వల్లే ఈ ఘర్షణలు ప్రేరేపించబడ్డాయిన ఆయన అన్నారు. బీహార్ లో ఇలాంటి ఘర్షణలు తొలిసారిగా జరిగాయని, ఇది సహజంగా జరగలేదని, కొందరు వ్యక్తుల… -
Delhi Hit And Drag Case: యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసులో 800 పేజీల ఛార్జిషీట్ దాఖలు..
Delhi Hit And Drag Case: కొత్త సంవత్సరం తొలిరోజున ఢిల్లీలో యువతిని ఢీకొట్టి దాదాపుగా 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపుగా 13 కిలోమీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. కారు కింద చిక్కుకుపోయిన యువతి తీవ్ర గాయాలపాలై మరణించింది. ఈ కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. ఛార్జిషీట్ లో 117 మంది సాక్షులను చేర్చింది. ఐదుగురు నిందితులు దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా,…
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!